AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

cannabis : జగ్గంపేట జాతీయ రహదారిపై రామవరం రాజస్థాన్ ధాబా దగ్గర 240 కేజీల గంజాయి పట్టివేత, ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్

Ganja caught : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది.

cannabis : జగ్గంపేట జాతీయ రహదారిపై రామవరం రాజస్థాన్ ధాబా దగ్గర 240 కేజీల గంజాయి పట్టివేత, ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్
Ganja
Venkata Narayana
|

Updated on: May 19, 2021 | 3:40 PM

Share

Ganja caught : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. రామవరం వద్ద రాజస్థాన్ ధాబా హోటల్ దగ్గర పోలీసులకు అందిన సమాచారం ప్రకారం తనిఖీలు చేపట్టారు. జగ్గంపేట ఎస్ఐ టి రామకృష్ణ నేతృత్వంలోని పోలీస్ బృందం అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా 240 కేజీల గంజాయి బయటపడింది. ఈ తనిఖీలలో జగ్గంపేట ఎమ్మార్వో సరస్వతి సహా, ఇద్దరు వీఆర్వోలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన నలుగురు యువకులు సిందోల్ రవీందర్ రెడ్డి, హోదగల్ రంజిత్ రెడ్డి, సయ్యద్ ఆరిఫ్ సామి, మేకల రామకృష్ణ అనే వీళ్లు TS 12 EL 8906 నెంబరు గల ఇన్నోవా కారు అద్దెకు తీసుకుని అన్నవరం వచ్చారు. ఆ తర్వాత వైజాగ్ నుండి AP 31 CU 4131 నెంబర్ గల షిఫ్ట్ డిజైర్ కారు ను అద్దెకు తీసుకుని రప్పించారు. ఈ యువకులు రెండు రోజులు అన్నవరంలో విశ్రాంతి తీసుకుని తరువాత దారకొండ వెళ్లి లోవ రాజు అనే వ్యక్తి సహాయంతో గంజాయి కేజీ రెండు వేల రూపాయలు చొప్పున 240 కేజీల గంజాయి కొనుగోలు చేసి ఈ కార్లలో బయలుదేరారు. ఈ గంజాయిని హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడ ఒక కేజీ ఐదు వేలు నుండి ఆరు వేల రూపాయలకు విక్రయించడం జరుగుతుందని అన్నారు. ఐతే మార్గంమధ్యలో రామవరం జాతీయ రహదారి పై రాజస్థాన్ హోటల్ దగ్గరికి వచ్చేసరికి ఇన్నోవా కారు బ్రేక్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ కారును రిపేర్ చేయించుకునే సరికి పన్నెండు గంటలు దాటింది. 12 దాటితే రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉండడం వలన పోలీసు నిఘా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజుకి అక్కడే ఉండి తర్వాత రోజు బయల్దేరదామని అనుకున్నారు.

ఇంతలో ఈ సమాచారం జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణకు అందిన వెంటనే పెద్దాపురం డీఎస్పీ దగ్గర అనుమతి తీసుకుని జగ్గంపేట ఎమ్మార్వో, ఇద్దరూ వీఆర్వో లు కలిపి తనిఖీ చేయగా 240 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, 9700 రూపాయల నగదు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. సిందోల్ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పై గతంలో గంజాయి కేసులున్నాయని మేకల రామకృష్ణ అనే యువకుడుకు ఇంకా మైనారిటీ తీరలేదని పోలీసులు తెలియజేశారు. యువత ఇటువంటి చర్యలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని జగ్గంపేట సీఐ సురేష్ బాబు సూచించారు.

Read also : Black Fungus : బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటి.. ఎవరెవరికి.. ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది..? పూర్తి వివరాలు అందించిన స్టేట్ నోడల్ ఆఫీసర్

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..