Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాచారంలో దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా హతమార్చిన దంపతులు.. ఆ తర్వాత ఏం చేశారంటే..?

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. నాచారం మల్లాపూర్‌ ప్రాంతంలో సోయల్‌ అనే యువకుడిని హత్యచేశారు దంపతులు.

నాచారంలో దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా హతమార్చిన దంపతులు.. ఆ తర్వాత ఏం చేశారంటే..?
Boy Murder
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 17, 2021 | 10:48 AM

వివాహేతర సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. పచ్చటి సంసారాల్లో అగ్గిరాజేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నాచారం మల్లాపూర్‌లో జరిగిన ఘటన విషాదాన్ని దింపింది. మల్లాపూర్‌ ప్రాంతంలో సోయల్‌ అనే యువకుడిని హత్యచేశారు దంపతులు. అతన్ని హతమార్చిన అనంతరం నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు మొయినుద్దీన్‌, నేహా అనే జంట. అక్రమ సంబంధమే కారణమంటున్నారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్లాపూర్‌లో వివాహేతర బంధం యువకుడి ప్రాణం తీసింది. అక్రమ సంబంధానికి యువకుడు అడ్డంగా బలయ్యాడు. నేహా అనే మహిళ సోయల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత రాత్రి భర్త లేని సమయంలో నేహా, సోయల్‌ను ఇంటికి పిలిపించుకుంది. అదే సమయంలో భర్త ఇంటికి వచ్చాడు. భర్త మొయినుద్దీన్ భార్య నేహాను, ప్రియుడు సోయల్‌ను గదిలో చూసి నిలదీశాడు. దీంతో నేహా ప్లేట్ ఫిరాయించింది. సోయల్ బలవంతం చేయబోయాడని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి సోయల్ గొంతు కోసి హత్య చేశారు. తర్వాత నిందితులు నాచారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్పాట్‌కు చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also…  

LPG: ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీ పొందడం ఎలా?.. గ్యాస్‌ సిలిండర్‌ డీలప్‌షిప్‌ కావాలంటే ఏం చేయాలి.. పూర్తి వివరాలు

ఇది సినిమా షూటింగ్‌ కాదు…బోట్‌ రేసింగ్‌ అంతకంటే కాదు….నడిసంద్రంలో మత్స్యకారుల మధ్య బిగ్ ఫైట్.. ఎందుకంటే?