Kolkata: మ్యాన్‌హోల్‌లో చిక్కుకున్న పారిశుధ్య కార్మికులు.. నలుగురు మృతి..

Four labours die: మ్యాన్‌హోల్‌ నాలుగు ప్రాణాలను బలిగొంది. మ్యాన్‌హోల్‌లో చిక్కుకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో గురువారం సంభవించింది. కోల్‌కతాలోని కుద్‌ఘాట్‌..

Kolkata: మ్యాన్‌హోల్‌లో చిక్కుకున్న పారిశుధ్య కార్మికులు.. నలుగురు మృతి..
Follow us

|

Updated on: Feb 25, 2021 | 10:29 PM

Four labours die: మ్యాన్‌హోల్‌ నాలుగు ప్రాణాలను బలిగొంది. మ్యాన్‌హోల్‌లో చిక్కుకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో గురువారం సంభవించింది. కోల్‌కతాలోని కుద్‌ఘాట్‌ ప్రాంతంలోని ఐక్యాటన్ క్లబ్ సమీపంలో పూర్బా పుటియరీ పంప్ హౌస్ వద్ద భూగర్భ మురుగు కాలువ వద్ద ఏడుగురు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12.30గంటల సమయంలో అక్కడి మ్యాన్‌హోల్‌లో వీరంతా చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని మ్యాన్‌హోల్‌లో చిక్కుకున్న సిబ్బందిని బయటకు తీశారు.

కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఏడుగురిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే అప్పటికే నలుగురు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. గాయాలపాలైన మిగతా ముగ్గురు కార్మికులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. మృతులు మాల్దా జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. జహంగీర్ ఆలం (22), అలీ లియాకత్ అలీ (20), సబీర్ హుస్సేన్, ఎండీ అలమ్‌గీర్లుగా మృతులను గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు.

Also Read:

MLC K. Kavitha: ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు.. 

Mukesh Ambani: ముఖేష్ అంబానీ బంగ్లా సమీపంలో అనుమానాస్పద కారు.. అప్రమత్తమైన పోలీసులు.. కుట్రకు పన్నాగం..?