ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
ఉత్తరాఖండ్లో గురువారం (మార్చి 19) ఉదయం ఒక ఘోర ప్రమాదం జరిగింది. చందౌలి జిల్లా బనౌలి ఖుర్ద్ గ్రామంలో నిర్మాణ సమయంలో వంతె కుప్పకూలిపోయింది. ఆ నిర్మాణం మొత్తం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొనగా, సంఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరాఖండ్లో గురువారం (మార్చి 19) ఉదయం ఒక ఘోర ప్రమాదం జరిగింది. చందౌలి జిల్లా బనౌలి ఖుర్ద్ గ్రామంలో నిర్మాణ సమయంలో వంతె కుప్పకూలిపోయింది. ఆ నిర్మాణం మొత్తం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొనగా, సంఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు సంఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
బనౌలి ఖుర్ద్ గ్రామ పరిషత్ పరిధిలో వంతెన నిర్మాణం వేగంగా జరుగుతోంది. కాస్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. అకస్మాత్తుగా, వంతెన నిర్మాణం బలహీనపడి, మొత్తం స్లాబ్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో పలువురు కార్మికులు సంఘటనా స్థలంలోనే ఉన్నారు. కాబట్టి శిథిలాల కింద కొందరు పూడిపోయి ఉండవచ్చని భయపడుతున్నారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. గ్రామస్థుల సహాయంతో గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స కోసం పంపించారు. అయితే, ప్రాణనష్టం జరిగినట్లు అధికారికంగా ధృవీకరణ లేదు.
పోలీసు యంత్రాంగం నుండి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక కూలీ తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత నిర్మాణ బృందం, కాంట్రాక్టర్లు అక్కడి నుంచి పారిపోవడంతో గ్రామస్తులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వంతెన నిర్మాణంలో నాసిరకం సామగ్రిని వాడారని, నాణ్యతా ప్రమాణాలను విస్మరించారని, దానివల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిష్పక్షపాత విచారణ జరపాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి సరైన చికిత్స మరియు నష్టపరిహారం అందించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
