AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs Seized: ఢిల్లీలో కలకలం.. రైతు నాయకుడి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం..

భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా తాజాగా వచ్చిన పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు..

Drugs Seized: ఢిల్లీలో కలకలం.. రైతు నాయకుడి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం..
Delhi Police
Sanjay Kasula
|

Updated on: Dec 02, 2021 | 6:12 PM

Share

భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా తాజాగా వచ్చిన పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు ఘిటోర్ని ప్రాంతంలో దాడులు నిర్వహించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘిటోర్ని ప్రాంతంలోని ఫామ్ హౌస్ వెలుపల ఉన్న మినీ ట్రక్కు నుండి పోలీసులు ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాదారు నిందితుడు తనను తాను రైతు నాయకుడిగా అభివర్ణించుకుంటున్నాడని పోలీసులు చెబుతున్నారు. మినీ ట్రక్కులో 9.5 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పట్టుబడిన డ్రగ్స్‌ విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని సమాచారం.

పక్కా సమాచారం మేరకు డ్రగ్స్‌తో కూడిన మినీ ట్రక్కుపై పోలీసులు దాడి చేశారు. బుధవారం తొమ్మిదిన్నర కిలోల డ్రగ్స్ తో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుడు రంజిత్ రైనాగా నిర్ధారించారు. అతని వయసు 51 ఏళ్లుగా, గుల్షన్ వయసు 36 ఏళ్లుగా చెబుతున్నారు ఢిల్లీ పోలీసులు. నిందితుడు రంజిత్ రైనా తనను తాను రైతు నాయకుడిగా చెప్పుకున్నాడు. నిందితుడు రంజిత్ రైనా హర్యానాలోని కురుక్షేత్ర నివాసి అని పోలీసులు వెల్లడించారు. ‘హర్యానా ఆగ్రో ఫారెస్ట్రీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌’ అని ఇంటరాగేషన్‌లో తేలింది. ప్రస్తుతం అతని ఆరోపణలన్నింటిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రెండో నిందితుడు గుల్షన్ కుమార్ కూడా కురుక్షేత్ర వాసిగా గుర్తించారు.

కోటి విలువైన డ్రగ్స్ తో ఇద్దరు నిందితులు అరెస్ట్

నిందితులిద్దరూ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో అరెస్ట్‌ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు ఫామ్‌హౌస్‌పై కూడా విచారణ మొదలు పెట్టారు. త్వరలో ఫాంహౌస్ యజమానిని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. నవంబర్‌లో ముంబై పోలీసులు దాదాపు రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్‌తో నైజీరియన్‌కు చెందిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. పట్టుబడిన డ్రగ్స్‌ను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు పోలీసులు.

ఢిల్లీ నుంచి ముంబైకి రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పెద్ద ప్రచారాన్ని ప్రారంభించింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకోవడం ఇదే కారణం. ఇప్పుడు మరోసారి ఢిల్లీలోని ఘిటోర్ని ప్రాంతంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: CM KCR: వానాకాలంలో వ‌రి.. యాసంగిలో ఆ పంట‌లే వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచనలు..

Akhanda Movie: అఖండ మూవీ థియేటర్ సీజ్.. మ్యాట్నీ షోను అడ్డుకున్న అధికారులు.. ఎందుకంటే..

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!