Absconding: పదిహేనేళ్ళుగా ఉద్యోగం ఎగ్గొట్టేశాడు..అయినా జీతం మాత్రం తీసుకుంటూనే ఉన్నాడు..అసలు అలా ఎలా?

ఒకరోజు డ్యూటీకి వెళ్ళకపోతేనే.. ఎందుకు రాలేదు.. ఏమైపోయావు.. ఇలా ప్రశ్నల పరంపర ఎదుర్కోవాలి.. అలాగే, చెప్పకుండా మానేసినందుకు పైవాళ్ళు వేసే అక్షింతల్నీ భరించాలి. ఏ ఉద్యోగికైనా ఇంతే కదా.

Absconding: పదిహేనేళ్ళుగా ఉద్యోగం ఎగ్గొట్టేశాడు..అయినా జీతం మాత్రం తీసుకుంటూనే ఉన్నాడు..అసలు అలా ఎలా?
Absconding
Follow us

|

Updated on: Apr 22, 2021 | 7:34 PM

Absconding: ఒకరోజు డ్యూటీకి వెళ్ళకపోతేనే.. ఎందుకు రాలేదు.. ఏమైపోయావు.. ఇలా ప్రశ్నల పరంపర ఎదుర్కోవాలి.. అలాగే, చెప్పకుండా మానేసినందుకు పైవాళ్ళు వేసే అక్షింతల్నీ భరించాలి. ఏ ఉద్యోగికైనా ఇంతే కదా. ఒకవేళ మానేసిన రోజుకు పై అధికారి లీవ్ ఒప్పుకోకపోతే…జీతంలో కొత్త తప్పదు. ఇంతే కదా.. ఏ ఉద్యోగికైనా జరిగేది. కానీ, ఒక వ్యక్తి ఒకటీ రెండూ రోజులూ నెలలూ కాదు ఏకంగా పదిహేను సంవత్సరాలు డ్యూటీ ఎగ్గోట్టేశాడు. కానీ, మనోడికి జీతం మాత్రం కచ్చితంగా అందేస్తూనే ఉంది. అదేమిటి? ఎలా? మీకూ కుతూహలంగా ఉంది కదూ..ఆ కథేమిటో తెలుసుకుందాం!

ఇటలీలో ఈ ఘటన జరిగింది. ఒక ఉద్యోగి 2005 నుంచి తాను పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్ళడం మానేశాడు. కానీ, జీతం మాత్రం తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని గార్డియన్ పత్రిక రిపోర్ట్ చేసింది. ఈ వ్యక్తి పేరు సాల్వేటోర్ సుమాస్. ఇతను కాటాన్జారో నగరంలో ఒక ఆసుపత్రిలో పనిచేసేవాడు. అయితే, ఈ పదిహేనేళ్ళు ఉద్యోగం చేయకపోయినా, ఇతనికి అందిన జీతం అక్షరాలా 5,38,000 యూరోలు. ప్రస్తుతం ఈయన వయసు 66 ఏళ్లు. పోలీసులు ఇప్పుడు ఇతన్ని విచారిస్తున్నారు. ఇతనితో పాటు హాస్పిటల్ కు చెందిన ఆరుగురు మేనేజర్లను కూడా ఈ కేసులో బుక్ చేశారు పోలీసులు. సుమాస్ డ్యూటీకి రాకపోయినా అటెండెన్స్ ఎలా ఇచ్చారనే విషయంపై వారి నుంచి సమాచారం రాబడుతున్నారు.

ఇంతకీ ఈయనగారు ఉద్యోగానికి ఎందుకు రావడం లేదు అనే విషయాన్ని పోలీసులు ఆరా తీశారు. 2005 లో ఆ ఆసుపత్రి డైరెక్టర్ ను తనపై క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేయవద్దని బెదిరించాడు. ఆ గొడవల మధ్యలో అతను ఆసుపత్రికి రావడం మానేశాడు. ఆ తరువాత ఆ డైరక్టర్ కూడా రిటైర్ అయిపోయారు. అయితే, సుమాస్ ఆసుపత్రికి రాకపోయినా, ఆసుపత్రికి సంబంధించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ, ఎకౌంగ్స్ డిపాట్మెంట్ గానీ ఈ విషయాన్ని గమనించలేదు. అతనికి హాజరు.. దానితో పాటు జీతమూ వచ్చేస్తూ వచ్చింది. 2016 లో ఇటలీ ప్రధాని అక్కడి ఉద్యోగుల విషయంలో ఉన్న చట్టాలను కఠినతరం చేశారు. అన్ని విభాగాల్లో ఉద్యోగులకు సంబంధించిన వివరాలనూ పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న అన్ని మోసాలను బయటకు తీయాలని చెప్పారు. దీంతో జరిపిన విచారణతో ఈ విషయం బయటకు వచ్చింది.

Also Read: PM Kisan: మీరు పీఎం కిసాన్‌ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్నారా…? డబ్బులు రావడం లేదా..? అయితే ఇలా చేయండి

క్లైమేట్ ఛేంజ్ పై సాహసోపేత చర్యలు చేపట్టాం., ప్రధాని మోదీ వెల్లడి., ఇది నిరంతర ప్రక్రియ

Latest Articles
పెట్రోల్ పోసి తగులబెట్టారు.. పోలీసుల దర్యాప్తులో సంచలనం!
పెట్రోల్ పోసి తగులబెట్టారు.. పోలీసుల దర్యాప్తులో సంచలనం!
బెంగళూరు గెలిస్తే వాళ్లకు డేంజర్ బెల్స్ మోగినట్లే..
బెంగళూరు గెలిస్తే వాళ్లకు డేంజర్ బెల్స్ మోగినట్లే..
మళ్లీ సెట్స్‌పైకి వచ్చేసిన నటసింహం.. బాలయ్య 109 మూవీ విశేషాలు ఇవే
మళ్లీ సెట్స్‌పైకి వచ్చేసిన నటసింహం.. బాలయ్య 109 మూవీ విశేషాలు ఇవే
ఈ అలవాట్లు ఉంటే.. 50యేళ్లకు వచ్చే హైబీపీ 20యేళ్లకే తిష్టవేస్తుంది
ఈ అలవాట్లు ఉంటే.. 50యేళ్లకు వచ్చే హైబీపీ 20యేళ్లకే తిష్టవేస్తుంది
అరటి పండు తొక్క తీసినట్టు ఈజీగా వెల్లుల్లి పొట్టు తీయొచ్చు..
అరటి పండు తొక్క తీసినట్టు ఈజీగా వెల్లుల్లి పొట్టు తీయొచ్చు..
'విశ్వంభర'.. చిరంజీవికి ఎంతో స్పెషల్.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్
'విశ్వంభర'.. చిరంజీవికి ఎంతో స్పెషల్.. మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్
వేసవిలో కళ్ల సమస్యలా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే నయనానందమే!
వేసవిలో కళ్ల సమస్యలా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే నయనానందమే!
బడ్జెట్ హద్దు దాటితే.. ప్రాజెక్ట్ అటకెక్కినట్టే.!
బడ్జెట్ హద్దు దాటితే.. ప్రాజెక్ట్ అటకెక్కినట్టే.!
విడిపోయిన పాక్ ఆటగాళ్లు.. చిచ్చుపెట్టిన రోహిత్, బాబర్..
విడిపోయిన పాక్ ఆటగాళ్లు.. చిచ్చుపెట్టిన రోహిత్, బాబర్..
అప్పుడు రజినీకాంత్ మూవీలో సైడ్ యాక్టర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్
అప్పుడు రజినీకాంత్ మూవీలో సైడ్ యాక్టర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్