AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: అన్నకు రాఖీ కట్టిన కాసేపటికే అత్తింట్లో మరణం.. అసలేం జరిగింది..?

ఆదివారం రాఖీ పండుగ.. ఈ క్రమంలో ఓ యువతి అన్నకు ప్రేమతో రాఖీ కట్టింది. అతడి ఆశీర్వచనాలు తీసుకుంది. ఆ తర్వాత కాసేపటికే అత్తింట్లో శవంగా...

Vijayawada: అన్నకు రాఖీ కట్టిన కాసేపటికే అత్తింట్లో మరణం.. అసలేం జరిగింది..?
Women death
Ram Naramaneni
|

Updated on: Aug 23, 2021 | 9:35 AM

Share

ఆదివారం రాఖీ పండుగ.. ఈ క్రమంలో ఓ యువతి అన్నకు ప్రేమతో రాఖీ కట్టింది. అతడి ఆశీర్వచనాలు తీసుకుంది. ఆ తర్వాత కాసేపటికే అత్తింట్లో శవంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువతి.. అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్లిన సోదరుడు.. తన చెల్లి చనిపోయిందన్న విషయం తెలిసుకుని షాక్‌కు గురయ్యాడు. తిరిగి వచ్చేసరికి.. ఆమె విగత జీవిగా మార్చురీ బాక్సులో కనిపించడంతో గుండెలవిసేలా రోధించాడు. అత్తింటివారే ఆమె మరణానికి కారకులని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రసాదంపాడుకు చెందిన ఉష (23) రెండేళ్ల క్రితం అరండల్‌పేటకు చెందిన ఫణిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. భర్త మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తుండగా, ఉష సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌‌గా వర్క్ చేస్తోంది. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావంటూ తన చెల్లిని అత్తింటివారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసేవారని ఉష సోదరుడు సూర్యనారాయణ ఆరోపిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో చెల్లెలి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్లానని, తర్వాత రెండు గంటల్లోనే ఉష చనిపోయిందని ఫోన్ చేశారంటూ వాపోయాడు. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయిన ఉషను హాస్పిటల్‌కు తీసుకువెళ్లామని, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని భర్త, ఇతర బంధువులు చెబుతున్నారు. యువతి తండ్రి సత్యనారాయణ కంప్లైంట్ మేరకు సూర్యారావుపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సౌత్ ఏసీపీ ఎన్‌.వెంకటేశ్వర్లు, సీఐ సూర్యనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

కొద్ది రోజుల్లో వివాహం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తూ వరుడు మృతి!

వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు బైక్​పై వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న.. బైక్ ఢీకొని ఓ యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లి వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో కదిరి మండలం ఎర్రదొడ్డికి చెందిన మహేశ్‌ (26) మృతి చెందాడు. మహేశ్​కు ఈ నెల 27న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచేందుకు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మహేశ్ మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: ఆ ప్రాంతాలలో సిగరెట్లు, ఇతర పొగాకు పదార్థాలు అమ్ముతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక

పాలు అంటేనే ఆమడదూరం పరిగెడతారా? మరి కాల్షియం ఎలా? ఇవి ట్రై చెయ్యండి

ఈ అక్కా చెల్లెళ్లను గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో బాగా ఫేమస్
ఈ అక్కా చెల్లెళ్లను గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో బాగా ఫేమస్
గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?
గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?
ఎమ్మెల్యే కారును ఆపిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఎమ్మెల్యే కారును ఆపిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
పుట్టిన వెంటనే శిశువు ఏడవడానికి అసలు కారణం ఇదే..
పుట్టిన వెంటనే శిశువు ఏడవడానికి అసలు కారణం ఇదే..
అటు బుమ్రా, ఇటు అర్షదీప్.. కెరీర్‌లోనే తొలిసారి చెత్త రికార్డ్
అటు బుమ్రా, ఇటు అర్షదీప్.. కెరీర్‌లోనే తొలిసారి చెత్త రికార్డ్
ట్రంప్ తీరుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహం..!
ట్రంప్ తీరుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహం..!
వీసా, రూపే, మాస్టర్.. ఏది తీసుకుంటే మంచిదో తెలుసా..?
వీసా, రూపే, మాస్టర్.. ఏది తీసుకుంటే మంచిదో తెలుసా..?
IND vs PAK: పాక్ ఆటగాళ్లతో చేయి కలపనున్న వైభవ్ సూర్యవంశీ..
IND vs PAK: పాక్ ఆటగాళ్లతో చేయి కలపనున్న వైభవ్ సూర్యవంశీ..
గ్లోబల్ సమ్మిట్, పంచాయతీ ఎన్నికలు.. తెలంగాణ పోలీసులకు మరో ఛాలెంజ్
గ్లోబల్ సమ్మిట్, పంచాయతీ ఎన్నికలు.. తెలంగాణ పోలీసులకు మరో ఛాలెంజ్
చీరకట్టుతో పవర్ లిఫ్టింగ్..ప్రగతిపై నాగబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్
చీరకట్టుతో పవర్ లిఫ్టింగ్..ప్రగతిపై నాగబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్