AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో క‌రోనా క‌ల్లోలం..విజయవాడలో దంపతుల మృతి !

ఏపీలో క‌రోనా క‌ల్లోలం రేపుతోంది. గంట‌గంట‌ల‌కు క‌రోనా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఏదో ఒక మూల‌న కోవిడ్-19 క‌ల‌క‌లం రేపుతోంది. ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ‌లోని పాత‌బ‌స్తీకి చెందిన భార్య‌భ‌ర్త‌లు

ఏపీలో క‌రోనా క‌ల్లోలం..విజయవాడలో దంపతుల మృతి !
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2020 | 5:40 PM

Share
ఏపీలో క‌రోనా క‌ల్లోలం రేపుతోంది. గంట‌గంట‌ల‌కు క‌రోనా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఏదో ఒక మూల‌న కోవిడ్-19 క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కు పెరిగిపోతుండ‌టంతో పాటు అనుమానితుల సంఖ్య కూడా సోమ‌వారం ఒక్క‌రోజులోనే అమాంతంగా పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ‌లోని పాత‌బ‌స్తీకి చెందిన భార్య‌భ‌ర్త‌లు ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలోనే మ‌ర‌ణించారు. వీరు ఇటీవ‌ల ఢిల్లీలోని ఓ మ‌త ప్రార్థ‌న‌ల కోసం వెళ్లివ‌చ్చిన‌ట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో మ‌రింత ఆందోళ‌న మొద‌లైంది.
విజ‌య‌వాడ పాతబస్తీలో నివ‌సిస్తున్న‌ ఓ దంపతులు కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ మత పరమైన కార్యక్రమానికి వెళ్లొచ్చారు. ఆ త‌ర్వాత  దంపతులిద్దరూ ఒకే లక్షణాలతో 24గంటల వ్యవధిలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం సాయంత్రం భార్య న్యుమోనియాతో మరణించింది. సోమవారం ఉదయం ఆమె భర్త కూడా అవే లక్షణాలతో కొత్త ప్రభుత్వాసుపత్రిలో చనిపోయాడు. దగ్గు, ఆయాసం లక్షణాలతో వీరిద్దరు మృతిచెందడంతో కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని ప‌రీక్షించిన డాక్టర్లు ధ్రువీకరించడంలేదు.
కాగా, వారి ఇద్దరు కుమార్తెలతో పాటు ఇతర బంధువులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే, దంప‌తుల మృతిపై  నివేదికలు వస్తేనే గానీ తాము అధికారంగా చెప్పలేమని డీఎంహెచ్‌వో అధికారులు చెబుతున్నారు. కాగా, విజ‌య‌వాడ‌లోని అదే ప్రాంతానికి చెందిన మ‌రో 26 మంది కూడా ఢిల్లీలో  జ‌రిగిన మ‌త కార్య‌క్ర‌మానికి వెళ్లిన్న‌ట్లుగా గుర్తించిన అధికారులు..వారంద‌రినీ క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అంద‌జేస్తున్నారు.

Follow Us
సోదరుల దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేసే దానాల్లో ఏది అత్యంత శుభ..
సోదరుల దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేసే దానాల్లో ఏది అత్యంత శుభ..
నయనతార ప్రాపర్టీ సామ్రాజ్యం! చెన్నై హోమ్-స్టూడియో టూ హైదరాబాద్..
నయనతార ప్రాపర్టీ సామ్రాజ్యం! చెన్నై హోమ్-స్టూడియో టూ హైదరాబాద్..
వార్నీ.. ఫ్రెష్ చేపలను గుర్తుపట్టడం ఇంత ఈజీనా..
వార్నీ.. ఫ్రెష్ చేపలను గుర్తుపట్టడం ఇంత ఈజీనా..
రతన్‌ టాటా ఎక్కడ నివసించేవారో తెలుసా? సముద్రం ఎదురుగా..
రతన్‌ టాటా ఎక్కడ నివసించేవారో తెలుసా? సముద్రం ఎదురుగా..
రాఖీ పండగ రోజే చంద్రగ్రహణం.. భారత్‌లో సూతక కాలం ఉంటుందా?
రాఖీ పండగ రోజే చంద్రగ్రహణం.. భారత్‌లో సూతక కాలం ఉంటుందా?
సెమీస్‌ పోరుకు సిద్ధమైన భారత్, పాకిస్తాన్.. ఎప్పుడంటే?
సెమీస్‌ పోరుకు సిద్ధమైన భారత్, పాకిస్తాన్.. ఎప్పుడంటే?
యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్..
యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్..
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కల్తీ ఆహారం.. రూ. 10 లక్షల జరిమానా!
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కల్తీ ఆహారం.. రూ. 10 లక్షల జరిమానా!
కొండా సురేఖపై వేటు..? అప్పటిలోపే కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం
కొండా సురేఖపై వేటు..? అప్పటిలోపే కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం
IPL 2027: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ.. కోహ్లీతో ఓపెనింగ్..?
IPL 2027: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ.. కోహ్లీతో ఓపెనింగ్..?