AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై వార్.. జీ 20 దేశాల సమైక్య శంఖారావం

కోవిడ్ 19 ని ఎదుర్కొనే విషయంలో జీ-20 కూటమి దేశాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్న వేళ.. ఈ వీరి మధ్య చర్చలు జరగడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

కరోనాపై వార్.. జీ 20 దేశాల సమైక్య శంఖారావం
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 31, 2020 | 6:56 PM

Share

ప్రపంచ దేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ పై యుధ్ధానికి జీ-20 దేశాల నేతలు సమాయత్తమయ్యారు. గ్లోబల్ ఎకానమీ తీవ్ర మాంద్యం లోకి దిగజారకుండా ఉండేందుకు 5 ట్రిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీని వీరు ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే ఈ నేతలు ఒకసారి దీనిపై చర్చలు జరపగా.. రెండో సారి తిరిగి సమావేశమవుతున్నారు. వీరి చర్చల ప్రధాన ఎజెండా కరోనాపై సమరమే.. ఆయా దేశాల మంత్రులు, బ్యాంకుల గవర్నర్లు ఈ రెండో విడత సమావేశంలో పాల్గొంటారని సౌదీ రాజు సల్మాన్ ప్రకటించారు. రొటేషన్ ప్రకారం జీ-20 దేశాల కూటమికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు.

కోవిడ్ 19 ని ఎదుర్కొనే విషయంలో జీ-20 కూటమి దేశాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్న వేళ.. ఈ వీరి మధ్య చర్చలు జరగడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భారీ ప్యాకేజీలో తాము 344 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా భారీ ఆర్ధిక సహాయాన్ని ప్రకటించాలని, ఇందుకు తాము చొరవ తీసుకోవాలని ఈ దేశాల నాయకులు  నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో ఆంక్షలపై మారటోరియం విధించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించారు. ఇందుకు అమెరికా అధినేత ట్రంప్ కూడా అంగీకరించారు. అయితే కరోనా మహమ్మారి వల్ల తలెత్తుతున్న ప్రమాదకర పరిణామాలను అన్ని దేశాలు గుర్తించాలని ట్రంప్ కోరారు.

Follow Us