మస్కట్ నుంచి బయల్దేరిన వందే భారత్ మిషన్ విమానం
వందే భారత్ మిషన్లో భాగంగా ఒమన్ నుంచి ఓ ప్రత్యేక విమానం భారత్కు బయల్దేరింది. మస్కట్ నుంచి బయల్దేరిన విమానం విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. ఈఫ్లైట్ 185 మంది భారతీయులు మరికొద్ది గంటల్లో విజయవాడకు చేరుకోనున్నారు. ఈ విమానంలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. వివిధ పనుల నిమిత్తం తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది గల్ఫ్ దేశాలకు వలస వెళుతూ ఉంటారు. ప్రస్తుతం అక్కడున్న వారిలో చాలా మంది ఉద్యోగాలు […]
వందే భారత్ మిషన్లో భాగంగా ఒమన్ నుంచి ఓ ప్రత్యేక విమానం భారత్కు బయల్దేరింది. మస్కట్ నుంచి బయల్దేరిన విమానం విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. ఈఫ్లైట్ 185 మంది భారతీయులు మరికొద్ది గంటల్లో విజయవాడకు చేరుకోనున్నారు. ఈ విమానంలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. వివిధ పనుల నిమిత్తం తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది గల్ఫ్ దేశాలకు వలస వెళుతూ ఉంటారు. ప్రస్తుతం అక్కడున్న వారిలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి నానా అవస్థలు పడుతున్నారు. విమాన టిక్కెట్ కూడా కొనుగోలు చేయలేక అనేక మంది అక్కడే ఇబ్బందుల్లో మగ్గుతున్నారు. మరోపక్క గల్ఫ్ నుంచి వచ్చే కార్మికులకు ఉచితంగా క్వారంటైన్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కాగా.. వందే భారత్ మిషన్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 70 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.