Telangana Corona Cases: తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ.. తాజాగా 228 కేసులు నమోదు..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా  50,998 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 228 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.

Telangana Corona Cases: తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ.. తాజాగా 228 కేసులు నమోదు..
Corona Cases Telangana
Follow us

|

Updated on: Mar 14, 2021 | 1:33 PM

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా  50,998 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 228 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,161కి చేరింది. కొత్తగా కరోనా కారణంగా ఒకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1653కి చేరింది.

తాజాగా మహమ్మారి బారి నుంచి నిన్న 152 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,97,515కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,993 యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో 795 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 46 కేసులు వెలుగుచూశాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 92,00,465కి చేరింది.

మరోవైపు  తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నిబంధనలను పాటిస్తూ అధికారులు పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయితే హైదరాబాద్ శివార్లలోని పలు పోలింగ్ సెంటర్లలో  ఓటు వేసేందుకు వచ్చిన వారికి కచ్చితంగా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. మదీనగూడ, శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట్‌ పరిధిలోని పలు కేంద్రాల్లో ఈ రకమైన టెస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తమకు ఉన్నతాధికారుల ఆదేశాలు అందాయాని ఆయా సెంటర్లలోని వైద్య సిబ్బంది తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చిన సిబ్బందికి కచ్చితంగా కరోనా టెస్టులు.. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని వెల్లడించారు.

కాగా కరోనా కేసులు మరోసారి ప్రమాదకరంగా పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు.

Also Read:  Summer Food: సమ్మర్ వచ్చేసింది.. శరీరాన్ని కూల్‌గా ఉంచుకోవాలంటే వీటిని తినాల్సిందే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్