AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన బుడతడు.. దేశంలో అత్యంత పిన్న వయస్కుడు..

కరోనాతో పోరులో దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగిన బుడతడు విజయం సాధించాడు. అమ్మ పొత్తిళ్లలో సేద తీరాల్సిన 20 రోజుల పసికందుకు కరోనా వచ్చింది. అయినా ఆ మహామ్మరితో యుద్ధం చేసి జయించాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకగా.. అతడి నుంచి వాళ్ల 20 రోజుల చిన్నారికి వైరస్ వచ్చింది. పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో ఏప్రిల్ 10న ఆ చిన్నారిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రత్యేక వార్డులో […]

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన బుడతడు.. దేశంలో అత్యంత పిన్న వయస్కుడు..
Ravi Kiran
|

Updated on: Apr 30, 2020 | 2:06 PM

Share

కరోనాతో పోరులో దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగిన బుడతడు విజయం సాధించాడు. అమ్మ పొత్తిళ్లలో సేద తీరాల్సిన 20 రోజుల పసికందుకు కరోనా వచ్చింది. అయినా ఆ మహామ్మరితో యుద్ధం చేసి జయించాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకగా.. అతడి నుంచి వాళ్ల 20 రోజుల చిన్నారికి వైరస్ వచ్చింది. పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో ఏప్రిల్ 10న ఆ చిన్నారిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందించారు.

ఇక 25 రోజుల తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడుగా ఆ బుడతడు తల్లి ఒడిలోకి చేరాడు. కాగా, ఈ విషయం గురించి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. చిన్నారికి నయం కావడం చాలా సంతోషంగా ఉందని.. ఇంత తక్కువ వయసులో కరోనా బారిన పడి కోలుకోవడం దేశంలో ఇదే ప్రధమం అని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 13 మంది చిన్నారులు డిశ్చార్జ్ అయ్యారు. వీరంతా గాంధీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి ఇది నిజంగా మంచి పరిణామమని.. త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ అవుతుందని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

Read This: ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!