శిఖర్ ధవన్‌కు హామీ ఇచ్చిన సోనూ సూద్

లాక్‌డౌన్‌తో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అన్ని తానై నిలిచాడు. నిలువ నీడలేని వారి జీవితాలు రోడ్డున పడినవారికి కొండంత అండగా నిలిచాడు రియాల్ హీరో సోనూ సూద్. ముంబైలో చిక్కుకున్న వేరే రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల కోసం సొంత ఖర్చుతో బస్సులు ఏర్పాటు చేసి వారిని తరలిస్తున్నారు. మహరాష్ట్ర నుంచి కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, కేరళ వంటి రాష్ట్రాలకు వేల సంఖ్యలో కార్మికులను తమ సొంత ఊరికి చేరుస్తూ రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు. […]

శిఖర్ ధవన్‌కు హామీ ఇచ్చిన సోనూ సూద్
Follow us

|

Updated on: May 26, 2020 | 4:33 PM

లాక్‌డౌన్‌తో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అన్ని తానై నిలిచాడు. నిలువ నీడలేని వారి జీవితాలు రోడ్డున పడినవారికి కొండంత అండగా నిలిచాడు రియాల్ హీరో సోనూ సూద్. ముంబైలో చిక్కుకున్న వేరే రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల కోసం సొంత ఖర్చుతో బస్సులు ఏర్పాటు చేసి వారిని తరలిస్తున్నారు. మహరాష్ట్ర నుంచి కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, కేరళ వంటి రాష్ట్రాలకు వేల సంఖ్యలో కార్మికులను తమ సొంత ఊరికి చేరుస్తూ రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు. సోనూసూద్‌ చేపట్టిన సేవా కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

తాజాగా సోనూ చేస్తున్న ఈ పనిపై టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ప్రశంసల జల్లులు కురిపించాడు. ‘‘సోనూ సూద్.. కష్టాల్లో ఉన్న వలసకూలీలను వాళ్ల సొంత ఊళ్లకు తరిలించడానికి నువ్వు చేసిన వీరోచిత ప్రయత్నానికి నా బిగ్ సెల్యూట్’’ అని ట్వీట్ చేశాడు. శిఖర్ చేసిన ట్వీట్‌పై సోనూసూద్ స్పందించాడు. ‘‘చాలా థాంక్స్ సోదరా. శిఖర్ ధవన్ క్రీజ్‌లో ఉంటే మనం భద్రంగా ఉన్నామనే విషయం ఇండియాకి తెలుసు. అలాగే నేను ప్రతి వలస కూలీలు సురక్షితంగా ఇంటికి చేరే వరకూ క్రీజ్‌లోనే ఉంటాను అని మాటిస్తున్నాను’’ అని సోనూ హామీ ఇచ్చారు. సోను ఇచ్చిన రిప్లై ఇచ్చారు.