రేపే అప్పన్నకు చందనోత్సవం…భక్తులకు దర్శనం లేదు
వరాహ, నరసింహ అవతారాల కలియికగా కొలువుదీరిన సింహాచల అప్పన్నకు రేపు చందనోత్సవం (నిజరూప దర్శనం) నిర్వహించనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అతి తక్కువ మంది భక్తులతోనే ఈ సారి ఉత్సవాన్ని పూర్తి చేయనున్నారు. ఇప్పటికే కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్, మెట్ల మార్గాలను మూసివేశారు. ఆలయ మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల వరకు ఆలయ మార్గాలు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారి మేల్కొలుపు.. చందనోత్తరణ నిర్వహిస్తారు. […]
వరాహ, నరసింహ అవతారాల కలియికగా కొలువుదీరిన సింహాచల అప్పన్నకు రేపు చందనోత్సవం (నిజరూప దర్శనం) నిర్వహించనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అతి తక్కువ మంది భక్తులతోనే ఈ సారి ఉత్సవాన్ని పూర్తి చేయనున్నారు. ఇప్పటికే కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్, మెట్ల మార్గాలను మూసివేశారు. ఆలయ మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల వరకు ఆలయ మార్గాలు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారి మేల్కొలుపు.. చందనోత్తరణ నిర్వహిస్తారు.
ఉత్తరాంద్ర వాసుల కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారు స్వామిగా సింహాచల అప్పన్నను భక్తులు కొలుస్తుంటారు. అలాంటి స్వామివారి నిజరూప దర్శనం ఒక్క రోజు మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు. పురూరవ చక్రవర్తుల కాలం నుంచి నేటి వరకూ చందనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రులతో సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతుంటారు. ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనాన్నిచూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ, ఈ యేడు కరోనా కారణంగా లాక్డౌన్ నేపధ్యంలో పరిమిత సంఖ్యలో వైదిక సిబ్బందితో ఉత్సవానికి ఏర్పాట్లు చేశారు.