AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid vaccine: కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ప్రధాని తల్లి హీరాబెన్.. ట్విట్ చేసిన పీఎం మోదీ..

Heeraben Modi receives Corona vaccine: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు

Covid vaccine: కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ప్రధాని తల్లి హీరాబెన్.. ట్విట్ చేసిన పీఎం మోదీ..
Shaik Madar Saheb
|

Updated on: Mar 11, 2021 | 4:08 PM

Share

Heeraben Modi receives Corona vaccine: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మార్చి 1న రెండో విడుత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం నాటినుంచి ప్రతిరోజూ లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు సైతం వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. తాజాగా ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ త‌ల్లి హీరాబెన్ మోదీ కూడా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. గురువారం గుజారాత్‌లో ఆమె వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ప్రధాని మోదీ తన ట్విట‌్టర్ ద్వారా వెల్లడించారు. మా అమ్మ ఈ రోజు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. వ్యాక్సిన్‌కు అర్హత కలిగిన మీ చుట్టు పక్కల వారిని అందరూ ప్రోత్సహించాలని సూచిస్తున్నానంటూ మోదీ ట్వీట్‌ చేశారు. కాగా ప్రధాని మోదీ కూడా ఈ నెల 1న కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న హైద‌రాబాద్ సంస్థ భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

దేశ‌వ్యాప్తంగా కరోనావ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2,52,89,693 కి చేరినట్లు గురువారం మధ్యాహ్నం కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. గ‌త 24 గంట‌ల్లో 9.2 లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు పేర్కొంది. ముందుగా జనవరి 16 నుంచి వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 1నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైన వారికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు.

Also Read:

Covid Vaccination: ఎన్నికల సంఘం చర్యలు.. ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోదీ ఫొటో తొలగింపు..

‘దయచేసి నిగ్రహంతో వ్యవహరించండి’, ఆసుపత్రి బెడ్ పై నుంచి మమత సందేశం