AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర జాగ్రత్త.. మొబైల్ ఫోన్లతో కరోనా వ్యాప్తి.!

కరోనా వైరస్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ వ్యాప్తికి మొబైల్ ఫోన్లు వాహకాలుగా పని చేస్తాయని రాయ్‌పూర్‌కు చెందిన AIIMS వైద్యులు షాకింగ్ నిజాలను వెల్లడించారు. ఇప్పటివరకు మనం కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముఖానికి మాస్క్ ధరించడం. హ్యాండ్ శానిటైజర్‌ను తరచూ వాడటం. భౌతిక దూరాన్ని పాటించడం వంటివి చేస్తున్నాం. ఇక ఇప్పుడు ఫోన్లతో కూడా జాగ్రత్తగా ఉండాలని వారు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఆసుపత్రుల్లో పని చేసేవారు ఫోన్లకు దూరంగా ఉండాలని.. […]

జర జాగ్రత్త.. మొబైల్ ఫోన్లతో కరోనా వ్యాప్తి.!
Ravi Kiran
|

Updated on: May 16, 2020 | 2:37 PM

Share

కరోనా వైరస్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ వ్యాప్తికి మొబైల్ ఫోన్లు వాహకాలుగా పని చేస్తాయని రాయ్‌పూర్‌కు చెందిన AIIMS వైద్యులు షాకింగ్ నిజాలను వెల్లడించారు. ఇప్పటివరకు మనం కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముఖానికి మాస్క్ ధరించడం. హ్యాండ్ శానిటైజర్‌ను తరచూ వాడటం. భౌతిక దూరాన్ని పాటించడం వంటివి చేస్తున్నాం. ఇక ఇప్పుడు ఫోన్లతో కూడా జాగ్రత్తగా ఉండాలని వారు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఆసుపత్రుల్లో పని చేసేవారు ఫోన్లకు దూరంగా ఉండాలని.. వాటిని తమతో పాటు తీసుకెళ్లకపోవడమే మంచిదన్నారు.

మొబైల్స్ వాడేటప్పుడు ముఖం, నోటి దగ్గర నుంచి వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని.. ఒకసారి ఫోన్లకు వైరస్ అంటుకున్నట్లయితే చేతులను ఎంతగా శుభ్రం చేసుకున్నా ఉపయోగం ఉండదని అంటున్నారు. అందుకే ఆసుపత్రుల్లో పని చేసేవారు తమ మొబైళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాలు, ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లలో ఫోన్ల వాడకంపై నిబంధనలు విధించాలన్నారు. ఫోన్లు వాడిన తర్వాత చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..

కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్‌లో 85 వేల కేసులు..

కరోనాను ఎదుర్కోండిలా.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు..

లాక్ డౌన్ 4.0.. రెడ్ జోన్లలో కటింగ్ షాపులకు అనుమతి!

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..

Breaking: సాయంత్రం 5 గంటలకు సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్..

ఏపీలో కరోనా నుంచి కోలుకున్న ‘ఆ’ జిల్లా..

Follow Us