షాకింగ్ న్యూస్ః ఒక కరోనా పెషేంట్ ఎంతమందికి వైరస్ని అంటించగలడంటే..?!
తాజాగా వెలుగుచూస్తున్న పాజిటివ్ బాధితులంతా.. ఎసింప్టమేటిక్ వారేనని డాక్టర్లు చెబుతున్నారు. ప్రపంచదేశాల్లో ఉన్నట్టుగా ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే ఈ కేసులు కనిపిస్తున్నాయంటున్నారు.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. వైరస్ లక్షణాలు బయటపడని వారివేనని తేలుతుండడం కలవరం రేపుతోంది. లాక్డౌన్ విధించి నెలరోజులు కావస్తున్నా కేసుల సంఖ్య తగ్గకపోగా.. పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా వెలుగుచూస్తున్న పాజిటివ్ బాధితులంతా.. ఎసింప్టమేటిక్ వారేనని డాక్టర్లు చెబుతున్నారు. ప్రపంచదేశాల్లో ఉన్నట్టుగా ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే ఈ కేసులు కనిపిస్తున్నాయంటున్నారు.
వైరస్ సోకితే ఇదివరకు 14 రోజుల తర్వాత కానీ లక్షణాలు బయటపడేవి కావు. కానీ ఇప్పుడు రోజులు గడుస్తున్నా సరిగా తెలియడం లేదు. కొద్దిగా బయటపడ్డ వారిని పరీక్షిస్తే.. పాజిటివ్గా నమోదవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇది ప్రమాదకర సంకేతంగా డాక్టర్లు భావిస్తున్నారు. దేశంలోని పది రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 65 శాతం ఎసింప్టమేటిక్ కేసులేనని చెబుతున్నారు. ఈ తరహా కేసుల వల్ల కరోనా వైరస్ సైలెంట్గా ఇతరులకు చేరిపోతుంది. వైరస్ బారిన పడ్డామన్న విషయం ఆ బాధితులకు కూడా తెలియదు. ఈ మధ్య వారు ఎవరిని కలిసినా కరోనా బారిన పడే అవకాశాలుంటాయని, ఈ వైరస్తో వచ్చిన సమస్యే ఇది అని వైద్యులు అంటున్నారు. వీలైనంత త్వరగా అలాంటి కేసుల్ని గుర్తించి… ఐసోలేట్ చెయ్యాల్సిన అవసరం ఉందని డాక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
HT సంస్థ జరిపిన విశ్లేషణలో.. మహారాష్ట్రలో మొత్తం పాటిజివ్ కేసుల్లో 65 శాతం, ఉత్తరప్రదేశ్లో 75 శాతం ఎసింప్టమేటిక్ కేసులుగానే ఉన్నాయని బయటపడింది. ఈ కేసుల్లో వ్యక్తులను టెస్టింగ్ చేసినప్పుడు కరోనా నెగెటివ్ అనే వచ్చింది. తీరా… కొన్ని రోజుల తర్వాత…వారికి కరోనా ఆల్రెడీ ఎప్పుడో సోకిందనే విషయం వెలుగుచూసింది. అసోంలో 82 శాతం కేసులు ఎసింప్టమేటిక్కేనని తేలింది. ఆ కేసుల్లో వారికి టెస్టింగ్ జరిపినప్పుడు దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం ఇలాంటి లక్షణాలు ఒక్కటీ కనిపించలేదు. ఢిల్లీలో 186 కేసులు ఎసింప్టమేటిక్కేనని తెలిసింది. హర్యానాలోనూ ఈ తరహా కేసులే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే ఈ కేసులు బయటపడుతున్నాయి. అసలు కరోనా ఎప్పుడు ఎలా సోకిందో కూడా కొందరి విషయంలో అర్థం కాని పరిస్థితి.
తాజా లెక్కల ప్రకారం… ఒక వ్యక్తి మరో 400 మందికి కరోనా వైరస్ని చేరవేయగలుగుతున్నట్లు తెలిసింది. అంటే… ఎసింప్టమేటిక్ కేసుల వల్ల కరోనా చాలా మందికి వ్యాపించే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. శరీరంలో సంబంధం లేనిది ఏది ప్రవేశించినా వెంటనే రియాక్షన్ మొదలవుతుంది. కరోనా వైరస్ బాడీలోకి వస్తే… వెంటనే జ్వరం రావాలి. లేదంటే ఆ వైరస్ని తరిమేందుకు మన బాడీలో మంచి బ్యాక్టీరియా పోరాడాలి. కానీ… చాలా కేసుల్లో అలా జరగట్లేదు. 14 రోజుల పాటు.. వైరస్ బాడీలోనే ఉన్నా రియాక్షన్ రావట్లేదు. ఇదే డాక్టర్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇండియాలో చాలా మంది ఎసింప్టమేటిక్ అవ్వడానికి ఓ బలమైన కారణం ఉంది. వారిలోకి ప్రపేశించే వైరస్ సంఖ్య వందలు లేదా వేలల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అదే వైరస్ లక్షల్లో ప్రవేశిస్తే… అప్పుడు వెంటనే లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ కోణంలో చూస్తే… ఇండియాలో చాలా మందికి కరోనా వైరస్ అంతంతమాత్రంగానే బాడీలోకి చేరుతోందని అనుకోవచ్చని భావిస్తున్నారు.




