AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prosopagnosia: కోవిడ్‌ కొత్త సమస్య.. ముఖ అంధత్వం..! లక్షణాలు ఏంటంటే..

కరోనా కారణంగా లక్షలాది మంది చనిపోయారు. నేటికీ కరోనా ప్రజలను అంగుళం అంగుళం చంపేస్తోంది. కోవిడ్ తర్వాత అలసట, గుండె సంబంధిత సమస్యలే కాదు, ఇప్పుడు మరో వ్యాధి గురించిన సమాచారం బయటకు వచ్చింది.

Prosopagnosia: కోవిడ్‌ కొత్త సమస్య.. ముఖ అంధత్వం..! లక్షణాలు ఏంటంటే..
Face Blindness
Jyothi Gadda
|

Updated on: Apr 01, 2023 | 5:50 PM

Share

క‌రోనా వైర‌స్ వ‌ల్ల జ‌రుగుతున్న విప‌త్తులు ఒక‌టి రెండు కాదు. గత మూడు, నాలుగేళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను వెంటాడుతోంది. ఇప్పుడు మరోమారు కరోనా వైరస్ విజృంభిస్తోంది. కోవిడ్‌ బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత బాధితుల్లో ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు ఒక్కటి రెండూ కాదు. దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులు అలసట, మెదడు సంబంధిత ఫిర్యాదులు, శ్వాసకోశ సమస్యలు, బిపి, గుండె జబ్బుల ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. కొత్త అధ్యయనం ప్రకారం, చాలా కాలం పాటు కరోనా వైరస్‌కు గురైన వ్యక్తులలో ముఖ అంధత్వం సాధారణంగా మారిందంటున్నారు. దీనిని ప్రోసోపాగ్నోసియా అంటారు. ముఖ అంధత్వం లేదా ప్రోసోపాగ్నోసియా దీనినే ఫేస్ బ్లైండ్‌నెస్ అని కూడా అంటారు..ఈ సమస్య వస్తే ఎవ్వరినీ గుర్తుపట్టలేరు. ఈ పరిస్థితి ఎంతగా దిగజారి ఉంటుందంటే సన్నిహితులు, అంటే అమ్మ, నాన్న, స్నేహితులు, భర్త, భార్య, పిల్లలు ఇలాంటి బంధువులని కూడా గుర్తుపట్టలేరు.

ముఖ అంధత్వం అంటే ఏమిటి? ప్రోసోపాగ్నోసియా అనేది నాడీ సంబంధిత రుగ్మత. ఇందులో ముఖాలను గుర్తించే, వేరు చేసే సామర్థ్యం దెబ్బతింటుంది. బాధిత వ్యక్తులు తమ ప్రియమైన వారిని, కుటుంబ సభ్యులు, స్నేహితులను గుర్తించడం కష్టం. వారికి తెలిసిన, తెలియని ముఖాల మధ్య తేడాను గుర్తించడం కష్టం. ఎవరో తెలియని వ్యక్తి ముఖంలోంచి తన తండ్రి గొంతు వస్తోందని అనుకోవడం మొదలుపెడతారు.

వాయిస్‌తో ముఖాన్ని సరిపోల్చడంలో సమస్య: కార్టెక్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఇటీవలి అధ్యయనం ప్రకారం, అన్నీ అనే 28 ఏళ్ల మహిళ 2020లో కరోనాతో బాధపడింది. ఇప్పుడు ఆమెకు ముఖ అంధత్వం ఉంది. కోవిడ్‌కి ముందు అన్నీకి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. ఇన్ఫెక్షన్ సోకి రెండు నెలలు గడిచినా కుటుంబ సభ్యులను సరిగా గుర్తించలేకపోయింది.. ఆమె ముఖాన్ని గుర్తించకపోవడంతో రెస్టారెంట్‌లోని వాయిస్‌ని ఆమె తండ్రి గుర్తించారు.

ఇవి కూడా చదవండి

అధ్యయనం ఏమి కనుగొంది? : అన్నీకి మాత్రమే ఈ సమస్య రాలేదు. కరోనా తర్వాత చాలా మంది ముఖ అంధత్వంతో బాధపడుతున్నారు. అధ్యయనంలో, అన్నీ సహా 54 మందిని అధ్యయనం చేశారు. అతనికి దృశ్యమాన గుర్తింపు సమస్య ఉందని నిపుణులు తెలిపారు.

ఎంత మందికి ఈ సమస్య ఉంది: ఎక్కువ కాలం కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ సమస్య ఉండదు. చాలా కాలంగా కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు కేవలం 2 నుంచి 3 శాతం మందికి మాత్రమే ఈ సమస్య ఉంది. ఈ పరిస్థితికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదని నిపుణులు చెబుతున్నారు. దీనిపై మరింత అధ్యయనం అవసరం. ప్రాథమిక పరిశోధనలో,దీనికి కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా చెబుతున్నారు. మెదడులోని ముఖాలను గుర్తించడంలో సహాయపడే భాగాన్ని కరోనా వైరస్ దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్