కరోనా నియంత్రణకు ‘ఇమ్యునోథెరపీ’.. అమెరికా కంపెనీతో ఒప్పందం..!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నియంత్రణలో ఇమ్యునోథెరపీ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నియంత్రణలో ఇమ్యునోథెరపీ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానం ద్వారా చికిత్స పద్ధతిని అభివృద్ధి చేసేందుకు అమెరికాకు చెందిన ప్రొడిజీ అనే కంపెనీతో హైదరబాద్లోని రియజిన్ ఇన్నోవేషన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు అవసరమైన చికిత్స విధానాలను కనుగొననున్నారు. ఇదిలా ఉంటే కరోనాను అరికట్టేందుకు ప్లాస్మా థెరపీపై కూడా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ థెరపీ మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ.. మరికొన్ని చోట్ల మాత్రం ఇవ్వడం లేదు. కాగా ఇమ్యునోథెరపీని క్యాన్సర్ చికిత్సలోనూ వాడుతుంటారన్న విషయం తెలిసిందే.
Read This Story Also: కరోనా వేళ దొంగల చేతివాటం.. లక్ష విలువ చేసే మందు బాటిళ్లు చోరీ..!