AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీలో ప్లాస్మా థెరపీ.. తొలి ప్లాస్మా దాత ఇతడే..

తెలంగాణలోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా వైద్యం మొదలైంది. ప్లాస్మాని మొదటిసారిగా అఖిల్ (24) అనే వ్యక్తి  డొనేట్ చేశాడు. వరంగల్‌కి చెందిన అఖిల్ బ్రిటన్‌లోని ఎడిన్‌ బర్గ్ యూనివర్శిటీలో చదువుకుంటున్నాడు. హైదరాబాద్‌ వచ్చిన ఇతనికి కరోనా వైరస్ సోకడంతో..

గాంధీలో ప్లాస్మా థెరపీ.. తొలి ప్లాస్మా దాత ఇతడే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 13, 2020 | 2:59 PM

Share

తెలంగాణలోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా వైద్యం మొదలైంది. ప్లాస్మాని మొదటిసారిగా అఖిల్ (24) అనే వ్యక్తి  డొనేట్ చేశాడు. వరంగల్‌కి చెందిన అఖిల్ బ్రిటన్‌లోని ఎడిన్‌ బర్గ్ యూనివర్శిటీలో చదువుకుంటున్నాడు. హైదరాబాద్‌ వచ్చిన ఇతనికి కరోనా వైరస్ సోకడంతో గాంధీ ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించారు డాక్టర్లు. 14 రోజుల తర్వాత అతడు వైరస్ బారి నుంచి కోలుకున్నాడు. దీంతో అఖిల్‌ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ప్లాస్మా థెరపీలో భాగంగా అతని రక్తంలోని ప్లాస్మాను సేకరించారు వైద్యులు. పచ్చరంగులో నీటిలా ఉండే ఈ ప్లాస్మా.. రక్త కణాలను కలిపి ఉంచుతుంది. రోగ నిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది.

అయితే ప్లాస్మా చికిత్స‌తో కరోనాకు పూర్తిగా చెక్ పెట్టలేకపోయినా.. వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ.. మందులు అందిస్తూ ఉంటే ఈ వైరస్ బారి నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ ప్లాస్మా చికిత్స చేసుకోవచ్చని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చెప్పింది. కాగా ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. కరోనా నుంచి బయటపడిన తన ప్లాస్మాతో మరికొందరి ప్రాణాలను నిలబడతాయంటే అంతకు మించిన సంతోషం లేదన్నాడు. నా వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుందన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు అఖిల్.

Read More:

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్

అమెరికాలో కలకలం.. పిల్లల్లో కొత్తరకమైన కోవిడ్.. 100 మంది పిల్లలు!