AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్‌లో మాస్క్ ధరించకుంటే ఫైన్.. ఎంతో తెలుసా…!

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే 50 రూపాయల జరిమానా విధించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది...

బీహార్‌లో మాస్క్ ధరించకుంటే ఫైన్.. ఎంతో తెలుసా...!
Sanjay Kasula
|

Updated on: Jul 04, 2020 | 5:49 PM

Share

Fine in Bihar for Not Wearing Mask : కరోనా కట్టడికి మాస్కు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం సరైన మార్గమని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నాయి. అయినా కరోనా తమకు రాదంటూ.. చాలా మంది కొవిడ్-19 వ్యాప్తికి వారదులుగా మారుతున్నారు. వారి నిర్లక్ష్యం చాలా మంది ప్రాణాలమీదికి తెస్తోంది. దీంతో బీహార్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే 50 రూపాయల జరిమానా విధించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య విభాగం ఓ ప్రకటనను జారీ చేసింది. అలాగే, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి మాస్క్ లేకుండా తిరిగి పట్టుబడేవారికి అవగాహన కల్పించడంలో భాగంగా ఉచితంగా రెండు ఫేస్ మాస్కులు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. బీహార్‌లో నేడు కొత్తగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,460కి చేరుకుంది. ఇప్పటి వరకు 8,211 మంది కరోనా నుంచి కోలుకున్నారు.