AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టులో మరింత జాగ్రత్త!..హైదరాబాద్ పట్ల కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

దేశంలో వేగంగా కరోనా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి టీమ్స్, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రులను

ఆగస్టులో మరింత జాగ్రత్త!..హైదరాబాద్ పట్ల కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2020 | 4:23 PM

Share

దేశంలో వేగంగా కరోనా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి టీమ్స్, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రులను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సర్కార్‌కు కీలక సూచనలు చేశారు. టెస్టులు ఎంత ఎక్కువగా చేస్తే కరోనాను అంతగా కట్టడి చేయొచ్చని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అనుసరించాలన్నారు. కరోనాను కట్టడి చేయడంలో అన్ని రాష్ట్రాలు దేశరాజధాని ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.

ఢిల్లీలో రికవరీ రేటు 84 శాతంగా ఉందన్నారు. ఆగష్టు నెలలో ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. టిమ్స్ ఆస్పత్రిలో మరింత అభివృద్ధి చేసి సదుపాయాలను కల్పించాలని కిషన్ రెడ్డి తెలంగాణ సర్కారుకు సూచించారు. టిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని భర్తీ చేయాలన్నారు. కరోనా బారిన పడిన పేషెంట్లు హోం ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్నారని అన్నారు.