పూరీ జగన్నాథ ఆలయానికి లవర్స్ ఎందుకు వెళ్లరో తెలుసా?

Samatha

18 July 2026

పూరీ జగన్నాథ రతయాత్ర మొదలైంది. ఒడిశాలోని పూరీలో ఉన్న ఈ ఆలయానికి  లక్షలాది మంది  వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

రథ యాత్ర

స్వామి వారి రథ యాత్ర, ఆయన దర్శన భాగ్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. దీనికి అంత ప్రత్యేకత ఉంటుంది.

దర్శన భాగ్యం

అయితే ఈ ఆలయం వెనక కూడా అనేక కథలు ఉన్నాయి. ముఖ్యంగా లవర్స్ ఈ ఆలయానికి వెళ్లరు.

అనేక కథలు

పెళ్లి కాని వారు జంటగా ఈ ఆలయానికి ఎందుకు వెళ్లరు, ప్రేమికులు ఈ ఆలయానికి వెళ్తే ఏం జరుగుతుంది. దీని వెనకున్న కథ ఏంటో చూద్దాం.

పెళ్లికాని వారు

పురాణాల ప్రకారం చూస్తే, ఓసారి రాధ జగన్నాథుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడిని చూడటానికి పూరీకి వస్తుందంట.

పురాణాల ప్రకారం

అయితే ఆ ఆలయంలోనికి  ఆయన భార్యలకు మాత్రమే ప్రవేశం ఉందని పండితులు రాధను లోనికి అనుమతి ఇవ్వలేదంట.

భార్యలకు

దీంతో రాధ పెళ్లి కానీ వారు ఈ ఆలయానికి జంటగా వస్తే వారు విడిపోతారని శాపం ఇచ్చిందని చెబుతుంటారు పండితులు, పూర్వీకులుజ

రాధ శాపం

అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు వివాహం కాని వారు జంటగా ఈ ఆలయానికి వెళ్లరంట. వెళితే  వారు విడిపోతారని భయంతో వెళ్లరంట.

విడిపోవడం