AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కామర్స్ సంస్థలకు ఊరట.. ఫోన్ అమ్మకాలకు ‘గ్రీన్’ సిగ్నల్

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్ సంస్థలకు ఊరట లభించింది. మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసరేతర వస్తువులను డోర్ డెలివరీ చేసేందుకు అనుమతులు లభించాయి. అయితే రెడ్ జోన్లలో మాత్రం ఈ సంస్థలు కేవలం అత్యవసర వస్తువులను మాత్రమే డెలివరీ చేయగలవు. కాగా, దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం మరో రెండు వారాల అనగా మే 17 వరకు లాక్ డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా మూడో దశ […]

ఈ కామర్స్ సంస్థలకు ఊరట.. ఫోన్ అమ్మకాలకు 'గ్రీన్' సిగ్నల్
Ravi Kiran
|

Updated on: May 02, 2020 | 4:55 PM

Share

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్ సంస్థలకు ఊరట లభించింది. మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసరేతర వస్తువులను డోర్ డెలివరీ చేసేందుకు అనుమతులు లభించాయి. అయితే రెడ్ జోన్లలో మాత్రం ఈ సంస్థలు కేవలం అత్యవసర వస్తువులను మాత్రమే డెలివరీ చేయగలవు. కాగా, దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం మరో రెండు వారాల అనగా మే 17 వరకు లాక్ డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే.

తాజాగా మూడో దశ లాక్ డౌన్‌కు కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే ప్రజలకు ఈ కామర్స్ సంస్థలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేయవచ్చు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని జిల్లాలను కరోనా కేసుల బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్, కంటైన్‌మెంట్‌ జోన్లుగా విభజించింది.

Read More:

కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!

లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..

గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు.. షాకింగ్ నిజాలు.!

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..

షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…