AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం డ్రైవ‌ర్‌కి క‌రోనా…! అధికారుల్లో ఆందోళ‌న‌

దేశంలో వైర‌స్ భాదితుల సంఖ్య 46 వేలు దాటిపోయింది. సామాన్యుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు ఎవ్వ‌రీని ఈ వైర‌స్ వ‌ద‌ల‌టం లేదు. తాజాగా అక్క‌డ ఓ ముఖ్య‌మంత్రి నివాసానికే క‌రోనా సెగ‌లంటుకున్నాయి.

సీఎం డ్రైవ‌ర్‌కి క‌రోనా...! అధికారుల్లో ఆందోళ‌న‌
Jyothi Gadda
|

Updated on: May 06, 2020 | 3:31 PM

Share

కోవిడ్‌-19 ప్ర‌పంచ దేశాల‌ను త‌న ప్ర‌తాపంతో గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న వైర‌స్ మ‌హ‌మ్మారి భార‌త్‌లోనూ రోజురోజుకూ వేగంగా విస్త‌రిస్తోంది. లాక్ డౌన్ చాలా పక్కాగా అమలు చేస్తున్నప్పటికీ కూడా కరోనా భాదితులు ఎప్ప‌టిక‌ప్పుడు పెరిగిపోతున్నారు. ఇప్పటికే  దేశంలో వైర‌స్ భాదితుల సంఖ్య  46 వేలు దాటిపోయింది. సామాన్యుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు ఎవ్వ‌రీని ఈ వైర‌స్ వ‌ద‌ల‌టం లేదు. తాజాగా అక్క‌డ ఓ ముఖ్య‌మంత్రి నివాసానికే క‌రోనా సెగ‌లంటుకున్నాయి.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతుండ‌గా, రాజస్థాన్ రాష్ట్రంలోనూ వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గానే ఉంది. ఏకంగా ముఖ్యమంత్రి నివాసంలో కరోనా కలకలం రేపుతోంది. అశోక్ గెహ్లాట్ ఇంట్లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి వైరస్ బారిన పడ్డాడు. దీంతో అధికారులు అప్రత్తమయ్యారు. జైపూర్ బజాజ్ నగర్ కు చెందిన 59 ఏళ్ల వయసున్న అతడిని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందే అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు సెలవుపై ఇంటికి పంపించారు. మరోవైపు అతడు నివసించే జైపూర్లోని బజాజ్ నగర్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. అతడు ఎవరెవరిని కలిశారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు రాజస్థాన్ లో 3061 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 77 మంది చనిపోయారు.