AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multivitamin Tablets: మల్టీవిటమిన్, కాల్షియం టాబ్లెట్లు మింగేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే..!

ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న కరోనా భయం అంతా ఇంతా కాదు. అందుకే.. వైరస్‌‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా రాకుండా ఏలాంటి మందులు వాడాలి?

Multivitamin Tablets: మల్టీవిటమిన్, కాల్షియం టాబ్లెట్లు మింగేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే..!
Dangers Of Taking A Multivitamin, Calcium Tablets Every Day, Say Experts
Balaraju Goud
|

Updated on: Jun 04, 2021 | 9:03 PM

Share

Dangers of Heavy Taking a Multivitamin: ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న కరోనా భయం అంతా ఇంతా కాదు. అందుకే.. వైరస్‌‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా రాకుండా ఏలాంటి మందులు వాడాలి? ఏం చేయాలి? అనే ఆలోచనతో జనం పరుగులు తీస్తున్నారు. వ్యాధి రాకుండా ఉండాలంటే.. ఇమ్యూటీ కావాలి. దీని కోసం విటమిన్‌, కాల్షియం టాబ్లెట్స్‌ వాడేస్తున్నారు. వైద్యులను సంప్రదించకుండా ఆన్‌లైన్ జ్ఞానంతో తినేస్తున్నారు. దీంతో వీటి వాడకం ఏకంగా 110 శాతం పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్టు కాల్షియం, మల్టీవిటమిన్‌ టాబ్లెట్ల వాడకం విపరీత పరిణామాలకు దారితీస్తోంది. దీని వల్ల మోతాదుకు మించి శరీరంలో కాల్షియం శాతం పెరిగిపోతోంది. ప్రాణాంతకమంటున్నారు వైద్యులు. దీంతో ఒకరిద్దరు కాదు చాలా మంది ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వ్యాధులు లేనివారు దీర్ఘకాలిక రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. కాల్షియం నిల్వలు పెరిగిపోతే గుండె ఆగి ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సోషల్‌ మీడియా ప్రచారంతోనే ప్రజలు ఇలా తప్పు దారి పడుతున్నారని.. ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల విటమిన్లు అందుతాయని చెప్పి కొందరు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను డాక్టర్ సూచన లేకుండానే వేసుకుంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం విటమిన్‌, మినరల్స్‌ వంటి డైటరీ సప్లిమెంట్స్‌ తీసుకుంటే మేలు కంటే కొన్ని సందర్భాల్లో కీడే అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. డైటరీ సప్లిమెంట్స్‌ గుండెకు సహా శరీరానికి మేలు చేయకపోగా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్‌ ప్రణీత్‌ హెచ్చరిస్తున్నారు. ఓవైపు పౌష్టికాహారం తీంటూనే… మరోవైపు వైద్యుల సూచనల మేరకు టాబ్లెట్లను వాడటం మంచిదంటున్నారు. తద్వారా తమకు కరోనా సోకదనే ధైర్యం వారిలో కనిపిస్తోందంటున్నారు.

Read Also…  Mother cut throat her Kid: ఆ దృశ్యం చూస్తే తిండి సహించదు, నిద్రపట్టదు.. మూడేళ్ల కన్నబిడ్డను బ్లేడుతో గొంతు కోసిన కసాయి తల్లి..!