Coronavirus: అంబులెన్స్ నుంచి ఎగిరిప‌డ్డ క‌రోనా రోగి డెడ్‌బాడీ.. షాక్ కు గురైన స్థానికులు

క‌రోనా రోగి డెడ్‌బాడీ అంబులెన్స్ నుంచి ఎగిరిప‌డి చుట్టుపక్కల ఉన్నవారిని షాక్‌కి గురి చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది......

Coronavirus: అంబులెన్స్ నుంచి ఎగిరిప‌డ్డ క‌రోనా రోగి డెడ్‌బాడీ.. షాక్ కు గురైన స్థానికులు
Corona Patient Dead Body
Follow us

|

Updated on: Apr 23, 2021 | 5:52 PM

అంబులెన్స్ నుంచి ఎగిరిప‌డ్డ క‌రోనా రోగి డెడ్‌బాడీ.. బంధువుల‌కు అప్ప‌గించ‌కుండా మృతదేహం తరలింపు షాక్‌ తిన్న అక్కడున్న వారు

క‌రోనా రోగి డెడ్‌బాడీ అంబులెన్స్ నుంచి ఎగిరిప‌డి చుట్టుపక్కల ఉన్నవారిని షాక్‌కి గురి చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంబులెన్స్‌లో త‌ర‌లిస్తున్న రోగి మృత‌దేహాం బ‌య‌ట‌కు ఎగిరిప‌డ‌టంతో ఆ అంబులెన్స్ డ్రైవ‌ర్‌కు చెమ‌ట‌లు ప‌ట్టాయి.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని విదిషా జిల్లా ఆస్ప‌త్రిలో ఓ క‌రోనా రోగి చ‌నిపోయాడు. దీంతో ఆ డెడ్‌బాడీని అత‌ని బంధువుల‌కు అప్ప‌గించ‌కుండా, అంబులెన్స్‌లో త‌ర‌లిస్తున్నారు. ఆస్ప‌త్రి గేట్లు దాటి రాగానే, అక్క‌డున్న మూల‌మ‌లుపులో  అంబులెన్స్ నుంచి క‌రోనా మృత‌దేహాం బ‌య‌ట‌కు ఎగిరిప‌డింది. దీంతో డ్రైవ‌ర్ అంబులెన్స్‌ను ఆపాడు. రోగి డెడ్‌బాడీ  బ‌య‌ట ప‌డ‌టంతో డ్రైవ‌ర్‌ తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాడు. రోగి చ‌నిపోయాడ‌ని త‌మ‌కు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రి అధికారులు మృతదేహాన్ని తీసుకెళ్లారని మృతుడి బంధువులు ఆరోపించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో  కొత్త‌గా 12,384 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 75 మంది చ‌నిపోయారు.

Also Read: కరోనా బాధితులలో పురుషులే అధికం.. తాజా అధ్యయనాల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు..

దూళిపాళ్ల అరెస్టుతో ఏపీలో పొలిటికల్ ఫైట్ షురూ.. అనంతపురం నుంచి సిక్కోలు దాకా ఒకటే రచ్చ