AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. డీసీపీపై 500 మంది కానిస్టేబుళ్ల దాడి

దాదాపు 500 మంది కానిస్టేబుళ్లు కలిసి.. ఓ డీసీపీపై దాడి చేశారు. ఇది సినిమాలో సీన్ కాదు. రియల్‌గా జరిగింది. తమ సమస్యలు చెప్పుకోవడానికి 500 మంది కానిస్టేబుళ్లు డీసీపీ అధికారి ఇంటికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో డీసీపీతో కలిసి చర్చలు..

కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. డీసీపీపై 500 మంది కానిస్టేబుళ్ల దాడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2020 | 8:32 AM

Share

దాదాపు 500 మంది కానిస్టేబుళ్లు కలిసి.. ఓ డీసీపీపై దాడి చేశారు. ఇది సినిమాలో సీన్ కాదు. రియల్‌గా జరిగింది. తమ సమస్యలు చెప్పుకోవడానికి 500 మంది కానిస్టేబుళ్లు డీసీపీ అధికారి ఇంటికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో డీసీపీతో కలిసి చర్చలు జరిపారు. ఈ క్రమంలో అసహనంతో ఉన్న కానిస్టేబుళ్లు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై ఆ డీసీపీపై దాడికి దిగారు. దీంతో అక్కడే ఉన్న డీసీపీ ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. సేమ్ సినిమాను తలపించే ఈ సీన్.. మంగళవారం రాత్రి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది.

ఉమ్‌పున్ తుఫాన్ కారణంగా సహాయక చర్యల కోసం 500 మంది కానిస్టేబుళ్లకు ఆన్ డ్యూటీ వేశారు. అయితే వాళ్లు బ్యారక్‌లో ఉంటోన్న ఓ కానిస్టేబుల్‌కి కరోనా వైరస్ వచ్చింది. అయినా.. ఆ ప్రాంతంలో శానిటైజేషన్ చేయకుండా, మాస్కులు కూడా ఇవ్వకుండా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో కానిస్టేబుళ్లు డీసీపీ ఉంటోన్న నివాసం వద్దకు వెళ్లి నిరసన చేశారు. వెంటనే డీసీపీ పాల్ బయటకు వచ్చి వారిని శాంతించే ప్రయత్నం చేశారు. ఇలా చర్చలు జరుగుతున్న క్రమంలోనే.. కానిస్టేబుళ్లు డీసీపీపైకి దాడికి దిగారు. కంటైన్మెంట్ జోన్లలో పని చేస్తున్నా సరిపడా మాస్కులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు.

దీంతో అక్కడే ఉన్న మరికొంతమంది పోలీసులు డీసీపీని రక్షించి.. దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో యావత్తు దేశం షాక్‌కి గురైంది. కాగా బుధవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటనా స్థలాన్ని సందర్శించి కానిస్టేబుళ్లతో చర్చించి, ఆరా తీశారు.

ఇది కూడా చదవండి: 

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

‘కరోనా కాలర్ ట్యూన్‌’తో విసుగుచెందారా.. ఈ సింపుల్ ట్రిక్‌తో దాన్ని కట్ చేయండి