AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా తగ్గుముఖం.. ఏపీలో ఒక్క రోజులో ఎన్ని కేసులంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే అదే సమయంలో రికవరీ కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి.

కరోనా తగ్గుముఖం.. ఏపీలో ఒక్క రోజులో ఎన్ని కేసులంటే.!
Ravi Kiran
|

Updated on: Sep 07, 2020 | 5:33 PM

Share

Coronavirus Positive Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే అదే సమయంలో రికవరీ కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,368 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,06,493కు చేరింది. ఇందులో 97,932 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,04,074 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 70 మంది మరణించగా.. మృతుల సంఖ్య 4487కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 10,055 మంది కరోనాను జయించారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 584, చిత్తూరులో 875, తూర్పు గోదావరిలో 1312, గుంటూరులో 765, కడపలో 447, కృష్ణాలో 193, కర్నూలులో 316, నెల్లూరులో 949, ప్రకాశంలో 419, శ్రీకాకుళంలో 559, విశాఖలో 405, విజయనగరంలో 594, పశ్చిమ గోదావరిలో 950 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో గత వారం రోజులుగా 73,548‬ మంది కరోనాను జయించి ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Also Read: ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..