AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’పై సర్వే.. షాకింగ్ నిజాలు..!

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను ఇచ్చాయి. దీంతో చాలామంది కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ.. అటు ఆఫీస్‌ పనిని చేస్తున్నారు.

'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌'పై సర్వే.. షాకింగ్ నిజాలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 14, 2020 | 4:56 PM

Share

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను ఇచ్చాయి. దీంతో చాలామంది కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ.. అటు ఆఫీస్‌ పనిని చేస్తున్నారు. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ భారతీయుల్లో నిద్రపై బాగా ప్రభావాన్ని చూపుతోందట. ఓ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విషయంలో 1500 మందిపై సర్వే చేసింది. ఇందులో 67 శాతం మంది సరైన సమయానికి నిద్రపోకపోగా.. నిద్రలేమితో బాధపడుతున్నారని పేర్కొంది. లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చని 81శాతం మంది భావిస్తున్నట్లు వివరించింది.

లాక్‌డౌన్‌కు ముందు 46శాతం మంది 11గం.ల లోపు నిద్రపోతుండగా.. ఇప్పుడు 39శాతం మంది మాత్రమే ఆ సమయంలోపు నిద్రపోతున్నారని సర్వే తెలిపింది. ఇక 12 గం.ల తరువాత పడుకునే వారి సంఖ్య అప్పుడు 25శాతం ఉండగా.. ఇప్పుడు 35శాతానికి పెరిగినట్లు సమాచారం. కాగా లాక్‌డౌన్ తరువాత ఎక్కడివారు అక్కడే ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో పనిమనుషులు కూడా రావడం లేదు. దీంతో ఓ వైపు ఇంటి పని, మరోవైపు ఆఫీస్‌ పని రెండింటిని సమన్వయం చేసుకోవడం చాలా మందికి ఇబ్బందికి మారిందట. ఈ క్రమంలో తెలీకుండానే ఒత్తిడి పడటంతో.. పలువురు నిద్రకు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాల్లో కోత పడగా.. అది కూడా పలువురిపై ఎఫెక్ట్ చూపిస్తోందని.. దీంతో భారతీయుల్లో నిద్ర లేమి పెరుగుతోందని సర్వేలో తేలింది.

Read This Story Also: హీరో విడాకుల వెనుక అమలా, గుత్తా.. నటుడు ఏమన్నాడంటే..!