AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర తర్వాత దేశ రాజధానే.. కేసులు చూస్తే షాక్ తినాల్సిందే..

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. కేసుల సంఖ్యలో మాత్రం ఎలాంటి తగ్గింపు లేకుండా పోతోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి నమోదవుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచే నమోదవుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తామని ప్రకటిస్తున్న తరుణంలో కేసుల సంఖ్య చూసి.. ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే.. […]

మహారాష్ట్ర తర్వాత దేశ రాజధానే.. కేసులు చూస్తే షాక్ తినాల్సిందే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 03, 2020 | 11:33 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. కేసుల సంఖ్యలో మాత్రం ఎలాంటి తగ్గింపు లేకుండా పోతోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి నమోదవుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచే నమోదవుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తామని ప్రకటిస్తున్న తరుణంలో కేసుల సంఖ్య చూసి.. ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే.. దాదాపు  400 కేసులకు పైగా నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్యశాఖ ఓ రిపోర్టును విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 427 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇక ఇవాళ కరోనా నుంచి కోలుకుని 106 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

ఆదివారం నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,549 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 64 మంది ప్రాణలు కోల్పోగా… కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1,362 కి చేరింది.