దేశవ్యాప్తంగా 24వేలు దాటేసిన పాజిటివ్ కేసులు.. మొత్తం ఎన్నంటే..!
లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం ఉదయం నాటికి భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24వేలను దాటేసింది.
లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం ఉదయం నాటికి భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24వేలను దాటేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 24,506 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక తాజా వివరాల ప్రకారం దేశంలో 18,668 యాక్టివ్ కేసులు ఉండగా.. మరణాల సంఖ్య 775కు చేరింది. 5,063 మంది ఈ మహమ్మారి నుంచి రికవరీ అయ్యారు. కాగా కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్డౌన్ మే 3 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.
Read This Story Also: ‘లూసిఫర్’ రీమేక్లో ఈ మూడు మార్పులు జరగనున్నాయా..!