టాప్ టెన్ లిస్టులోకి చేరిన భారత్.. 4 వేలు దాటిన కరోనా మరణాలు..

భార‌త్‌లో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,38,845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 57,721 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 4021 మంది మృతి చెందారు. అటు 77,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు విషయంలో భారత్ ఇరాన్‌ను దాటేసి టాప్ టెన్ లిస్టులోకి చేరిపోయింది. ఇరాన్‌లో ఇప్పటి వరకు 135,701 కేసులు నమోదు కాగా భారత్‌లో […]

టాప్ టెన్ లిస్టులోకి చేరిన భారత్.. 4 వేలు దాటిన కరోనా మరణాలు..
Follow us

|

Updated on: May 25, 2020 | 9:50 AM

భార‌త్‌లో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,38,845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 57,721 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 4021 మంది మృతి చెందారు. అటు 77,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు విషయంలో భారత్ ఇరాన్‌ను దాటేసి టాప్ టెన్ లిస్టులోకి చేరిపోయింది. ఇరాన్‌లో ఇప్పటి వరకు 135,701 కేసులు నమోదు కాగా భారత్‌లో 138,845 కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో మహారాష్ట్ర అత్యధిక కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలు ఆ తర్వాత ఉన్నాయి.

మహారాష్ట్ర టాప్, తమిళనాడు నెక్స్ట్.. 

కోయంబేడు లింకులతో తమిళనాడులో కరోనా రక్కసి తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో మ‌హారాష్ట్ర అత్యధికంగా 50 వేలు పైచిలుకు కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు 16,277 పాజిటివ్ కేసులు, 111 మరణాలతో రెండో స్థానంలోకి చేరింది. మొన్న‌టి వ‌ర‌కు గుజ‌రాత్ అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో రెండో స్థానంలో ఉండ‌గా, ఇప్పుడు త‌మిళ‌నాడు గుజ‌రాత్ స్థానాన్ని ఆక్ర‌మించేసింది. అటు గుజ‌రాత్‌లోనూ కోవిడ్‌-19 భూతం జ‌డ‌లు విప్పుకుంటోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 14,056 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 858 మంది ప్రాణాలు విడిచారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే కరోనా విలయం సృష్టిస్తోంది. అక్కడ 13,418 పాజిటివ్ కేసులు 261 మరణాలు సంభవించాయి.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఏపీలో ఇప్పటివరకు 2823 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 56 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ కేసులు గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. అటు తెలంగాణ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా 1854 పాజిటివ్ కేసులు, 53 మరణాలు సంభవించాయి. ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి.