AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కట్టడికి మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం

ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మరింత ఎక్కువయ్యాయి. అందులోనూ ముఖ్యంగా ఢిల్లీలో పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. ప్రస్తుతం అక్కడ 1069 కేసులతో దేశంలో రెండో స్థానంలో ఉంది. దీంతో నెక్ట్స్ ఏం చేయాలా అని మరో ఆసక్తికర నిర్ణయం..

కరోనా కట్టడికి మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 13, 2020 | 9:19 PM

Share

ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మరింత ఎక్కువయ్యాయి. అందులోనూ ముఖ్యంగా ఢిల్లీలో పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. ప్రస్తుతం అక్కడ 1069 కేసులతో దేశంలో రెండో స్థానంలో ఉంది. దీంతో నెక్ట్స్ ఏం చేయాలా అని మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని కరోనా ప్రభావాన్ని బట్టి.. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించింది. ఇవాళ్టి నుంచి ఈ మూడు జోన్లలోనూ శానిటైజ్ చేయ్యబోతుంది ఢిల్లీ ప్రభుత్వం. ప్రతీ వీధికీ, ఇంటికీ స్ప్రే చేయాలని శానిటైజ్ సిబ్బందిని ఆదేశించారు సీఎం కేజ్రీవాల్. ఆల్రెడీ సోమవారం ఉదయం 6 గంటలకే తొలి రౌండ్ మొదలైంది. కాగా ఢిల్లీలో తాజాగా ఐదుగురు కరోనాతో మరణించారు. దీంతో మొత్తం సంఖ్య 19కి చేరంది. అలాగే రోజుకి 100కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 34 రెడ్‌ జోన్లను గుర్తించిన ప్రభుత్వం.. మరిన్నింటిని గుర్తించే పనిలో ఉంది. ఇకపై రోజంతా ఈ రెడ్, ఆరెంజ్ జోన్లలో శానిటేషన్ పనులు జరుగుతూనే ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జేసీ

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం

సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?