జన్ధన్ ఖాతాల్లోకి 3నెలలపాటు నగదు, విత్ డ్రాపై ఆంక్షలు
కరోనా వైరస్ నేపథ్యంలో జన్ధన్ మహిళల ఖాతాల నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రద్దీని అధిగమించేందుకు ఈ ఆంక్షలు పెట్టింది. ..

కరోనా వైరస్ నేపథ్యంలో జన్ధన్ మహిళల ఖాతాల నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రద్దీని అధిగమించేందుకు ఈ ఆంక్షలు పెట్టింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు భారీగా గుమిగూడే అవకాశం ఉంటుందని అంచనా వేసిన అధికారులు కొన్ని సూచనలు చేశారు.
కరోనా నేపథ్యంలో ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాల్లో 3 నెలలపాటు రూ. 500 చొప్పున జమ చేస్తున్నట్లు ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారులు నగదు విత్డ్రాల కోసం పెద్ద సంఖ్యలో బయటకు రావటంతో కరోనా వ్యాపించేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం భావించింది. ఈ మేరకు ఖాతా చివరన 0 లేక 1 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 3న నగదు ఉపంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు.
అలాగే ఖాతా చివరన 2 లేదా 3 అంకె ఉన్నవాళ్లయితే ఈ నెల 4న, చివరన 4 లేక 5 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 7న 6 లేక 7 సంఖ్య 8న 8 లేదా 9 అంకె అయితే ఈ నెల 9న నగదును ఉపసంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు. ఇక, ఈ నెల 9 లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తర్వాతైనా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఒక్క ఏపీలోనే జన్ధన్ఖాతాదారుల సంఖ్య 1,18,55,366 ఉన్నట్లుగా తెలుస్తోంది.