AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కాటుతో బంగ్లాదేశ్‌ డిఫెన్స్‌ సెక్రటరీ అబ్దుల్లా మృతి

కరోనా మహమ్మారి కాటేయడంతో.. బంగ్లాదేశ్‌ రక్షణ శాఖ కార్యదర్శి అబ్దుల్లా అల్‌ మోహసిన్‌ చౌదరి మరణించారు. గత మే నెల 29వ తేదీన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢాకాలోని మిలటరీ ఆస్పత్రిలో చేరారు.

కరోనా కాటుతో బంగ్లాదేశ్‌ డిఫెన్స్‌ సెక్రటరీ అబ్దుల్లా మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2020 | 1:55 PM

Share

కరోనా మహమ్మారి కాటేయడంతో.. బంగ్లాదేశ్‌ రక్షణ శాఖ కార్యదర్శి అబ్దుల్లా అల్‌ మోహసిన్‌ చౌదరి మరణించారు. గత మే నెల 29వ తేదీన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢాకాలోని మిలటరీ ఆస్పత్రిలో చేరారు. జూన్ 6వ తేదీన ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ నెల 18వ తేదీన ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. సోమవారం నాడు మరణించారు. ఉదయం 9.30 గంటలకు మరణించినట్లు బంగ్లాదేశ్‌ రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

కాగా, బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు 1.37 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 1,738 మంది మరణించారు.