AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ తృతీయ: బంగారం కొనే కన్నా.. వీటిని దానం చేస్తే సకల శుభాలు

అక్షయ తృతీయ రోజు బంగారం తృణమో.. పణమో కొంటే ఇంట్లో సకల శుభాలు జరుగుతుయని మహిళల నమ్మిక. అయితే లాక్‌డౌన్ కారణంగా బంగారం కొనే పరిస్థితి లేదు. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనే దాని కంటే దానాలు, జపాలు, పూజలు చేస్తే..

అక్షయ తృతీయ: బంగారం కొనే కన్నా.. వీటిని దానం చేస్తే సకల శుభాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 26, 2020 | 3:46 PM

Share

అక్షయ తృతీయ రోజు బంగారం తృణమో.. పణమో కొంటే ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని మహిళల నమ్మిక. అయితే లాక్‌డౌన్ కారణంగా బంగారం కొనే పరిస్థితి లేదు. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనే దాని కంటే దానాలు, జపాలు, పూజలు చేస్తే ఎన్నో రెట్ల ఫలితాన్నిస్తాయని పెద్దలు, పురోహితులు చెబుతున్నారు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం.. పండ్లు, అన్నం, చెప్పులు, నువ్వులు, మంచం, దుస్తులు, కొబ్బరికాయలు, మజ్జిక, గొడుగు, భూమి, బంగారం, రజితం దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు దానం చక్కటి ఫలితాల్ని అందిస్తుంది.

-వస్త్రాలు, పండ్లు దానం చేస్తే విద్యా బుద్ధులు లభిస్తాయి -సిరి సంపదలు దక్కాలంటే జలదానం చేయాలి -కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలంటే శయన సాధనాలు.. అంటే మంచం, పరుపులు, దుప్పట్లు దానం చేయాలి -ఆరోగ్యం కోసం కొబ్బరికాయలు దానం చేయాలి – చందనం దానం చేస్తే.. ప్రమాదాల బారిన పడకుండా ఉంటారట -కష్టాల బారిన పడకుండా ఉండేందుకు చెప్పులు, పాదుకలు, గొడుగు దానం చేయాలి

Read More: 

తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!