AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్‌.. హోం క్వారంటైన్‌కు మున్సిపల్‌ కమిషనర్‌..!

గుజరాత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ కరోనా మహమ్మారి అధికారులను, రాజకీయ నేతలను కూడా వెంటాడుతోంది. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్ విజయ్‌ నెహ్రాను కూడా ఇప్పుడు కరోనా భయం వెంటాడుతోంది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌కు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇందుకు అసలు కారణమేంటంటే.. ఆయన ఓ కరోనా పాజిటివ్‌ పేషెంట్‌ను కలిసిరావడమే. దీంతో ఆయన ముందస్తు జాగ్రత్తగా పద్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్‌ వెళ్లేందుకు […]

బ్రేకింగ్‌.. హోం క్వారంటైన్‌కు మున్సిపల్‌ కమిషనర్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 05, 2020 | 7:26 PM

Share

గుజరాత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ కరోనా మహమ్మారి అధికారులను, రాజకీయ నేతలను కూడా వెంటాడుతోంది. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్ విజయ్‌ నెహ్రాను కూడా ఇప్పుడు కరోనా భయం వెంటాడుతోంది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌కు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇందుకు అసలు కారణమేంటంటే.. ఆయన ఓ కరోనా పాజిటివ్‌ పేషెంట్‌ను కలిసిరావడమే. దీంతో ఆయన ముందస్తు జాగ్రత్తగా పద్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

కాగా.. పద్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్‌ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు.. నెహ్రా స్థానంలో ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్‌గా వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ముఖేష్ కుమార్ కొనసాగనున్నారు. ముఖేష్ కుమార్ అహ్మదాబాద్ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్‌తో పాటు.. గుజరాత్ మారిటైన్ బోర్డ్‌కు సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని గుజరాత్‌ CMO తెల్పింది.