19 సార్లు కరోనా పాజిటివ్ ..20వ సారి కూడా టెస్ట్ చేస్తే..
కేరళకి చెందిన ఒక మహిళకి 19 సార్లు కరోనా పాజిటివ్ గా వచ్చిన విషయం తెలిసిందే ఆ మహిళకి తాజాగా మరో రెండు సార్లు కోవిడ్ నిర్ధారణ టెస్ట్లు నిర్వహించారు.
వైరస్ బారిన పడి లక్షల సంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలవుతుండగా, వేల సంఖ్య కరోనా పీడితులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేరళకి చెందిన ఒక మహిళకి 19 సార్లు కరోనా పాజిటివ్ గా వచ్చిన విషయం తెలిసిందే ఆ మహిళకి తాజాగా మరో రెండు సార్లు కోవిడ్ నిర్ధారణ టెస్ట్లు నిర్వహించారు. 45రోజుల పోరాటం అనంతరం ఎట్టకేలకు కరోనాను జయించింది. ఈ సారి జరిపిన రెండు పరీక్షల్లో నెగెటివ్ రావడంతో త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కేరళలోని పతనమిట్ట ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల మహిళ కుటుంబ సభ్యులు ఇటలీకి వెళ్లివచ్చారు. ఆ తర్వాత ఎప్పటిలాగానే అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. మార్చి 10న వారికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్ లోకి తరలించి చికిత్స అందించారు. గత రెండు వారాల క్రితం వారందరికీ నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే అప్పటికే వారితో సన్నిహితంగా మెలిగిన వారికి సైతం కరోనా సోకగా అందులో 93 ఏళ్ల వృద్ధుడితోపాటు 88 ఏళ్ల బామ్మ కూడా కరోనా నుంచి కోలుకున్నారు. కానీ ఈమె ఒక్కరికే తరచూ పాజిటివ్ అని తేలడంతో ఆసుపత్రిలోనే ఉండిపోయింది.