కరోనా రోగులకు వైద్యసేవలు చేస్తోన్న నటి
ఇప్పటి వరకూ కరోనాపై పోరాటానికి సినీ ప్రముఖులు డబ్బులను సాయం చేశారు. కానీ ఓ బాలీవుడ్ నటి మాత్రం ఏకంగా తానే స్వయంగా రంగంలోకి దిగింది. ఆస్పత్రిలోని రోగులకు సేవ చేసేందుకు ముందుకు వచ్చింది..
ఇప్పటి వరకూ కరోనాపై పోరాటానికి సినీ ప్రముఖులు డబ్బులను సాయం చేశారు. కానీ ఓ బాలీవుడ్ నటి మాత్రం ఏకంగా తానే స్వయంగా రంగంలోకి దిగింది. ఆస్పత్రిలోని రోగులకు సేవ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అది చూసిన పలువురు నెటిజన్లు.. ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే…
శిఖా మల్హోత్రా…బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ అనే సినిమాలో ఓ పాత్ర పోషించింది. ఆమె ఇప్పుడు ముంబైలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా మారి కోవిడ్-19తో పోరాతున్న వారికి చికిత్స చేస్తోంది. ఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీలో శిఖా నర్సింగ్ కోర్సును పూర్తి చేసింది. అయితే తనుచదివిన విద్యను వైరస్తో పారాడుతున్న వారిని కాపాడేందుకు ఉపయోగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని శిఖా స్పష్టం చేసింది.ఈ మేరకు ఆమె … ‘‘నాకు తెలిసిన విద్యను కోవిడ్-19 రోగులకు సేవ చేసేందుకు ఉపయోగిస్తాను. దేశసేవ కోసం ఎప్పుడూ నేను ముందుంటాను. అది నర్సుగా అయినా, నటిగా అయినా నాకు వీలైనంత సేవ అందిస్తాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి. అందరు ఇంట్లో ఉండండి. జాగ్రత్తగా ఉంటూ.. ప్రభుత్వానికి తగిన సహకారం అందించండి’’ అంటూ శిఖా తన ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.