AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి డేట్ ఫిక్స్.. ఆ రోజు మోదీ చేతుల మీదుగా ప్రారంభం

దేశంలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త. త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వీటిని విడతల వారీగా రైల్వేశాఖ ప్రవేశపెట్టనుంది. త్వరలో సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Venkatrao Lella
|

Updated on: Jan 08, 2026 | 8:29 AM

Share
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 17న ప్రధాని మోదీ మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. పశ్చిమబెంగాల్‌లోని  మాల్దాలోని నిత్యానందరూర్‌లో జనవరి 17న భారీ బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. ఆ రోజున వందే భారత్ స్లీపర్ రైలును మోదీ ప్రారంభించనున్నారు.

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 17న ప్రధాని మోదీ మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. పశ్చిమబెంగాల్‌లోని మాల్దాలోని నిత్యానందరూర్‌లో జనవరి 17న భారీ బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. ఆ రోజున వందే భారత్ స్లీపర్ రైలును మోదీ ప్రారంభించనున్నారు.

1 / 5
గువహతి-హౌరా మధ్య తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. దీని వల్ల పశ్చిమబెంగాల్, అసోం మధ్య సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ గరిష్ట వేగం 180 కిలోమీటర్లుగా ఉంది. హౌరా-గువహతి మధ్య గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు.

గువహతి-హౌరా మధ్య తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. దీని వల్ల పశ్చిమబెంగాల్, అసోం మధ్య సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ గరిష్ట వేగం 180 కిలోమీటర్లుగా ఉంది. హౌరా-గువహతి మధ్య గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు.

2 / 5
ఈ ట్రైన్‌లో ఒకేసారి 823 మంది ప్రయాణికులు వెళ్లేలా సీటింగ్ సామర్థ్యం అందుబాటులో ఉంది. అయితే సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరలను ఈ ట్రైన్‌లో ప్రవేశపెట్టారు. క్లాస్‌ను బట్టి రూ.2,300 నుంచి రూ.3600 వరకు ఛార్జీలను నిర్ణయించారు. ఇందులో విమానం తరహాలోనే లగ్జరీ సౌకర్యాలు ఉండనున్నాయి.

ఈ ట్రైన్‌లో ఒకేసారి 823 మంది ప్రయాణికులు వెళ్లేలా సీటింగ్ సామర్థ్యం అందుబాటులో ఉంది. అయితే సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరలను ఈ ట్రైన్‌లో ప్రవేశపెట్టారు. క్లాస్‌ను బట్టి రూ.2,300 నుంచి రూ.3600 వరకు ఛార్జీలను నిర్ణయించారు. ఇందులో విమానం తరహాలోనే లగ్జరీ సౌకర్యాలు ఉండనున్నాయి.

3 / 5
ఆటోమెటిక్ సెన్సార్ డోర్లు, సౌకర్యవంతమైన బెర్త్‌లు, మెడ్రన్ వాష్‌రూమ్స్ వంటివి ఈ వందే భారత్ స్లీపర్ రైల్లో ఉన్నాయి. ఇందులో ప్రయాణించేవారికి ఆహారం ఉచితంగా అందించనున్నారు. గువహతి నుంచి వచ్చేటప్పుడు అసోమీ, కోల్‌కత్తా నుంచి బయల్దేరేటప్పుడు బెంగాలీ వంటకాలు వడ్డించనున్నారు.

ఆటోమెటిక్ సెన్సార్ డోర్లు, సౌకర్యవంతమైన బెర్త్‌లు, మెడ్రన్ వాష్‌రూమ్స్ వంటివి ఈ వందే భారత్ స్లీపర్ రైల్లో ఉన్నాయి. ఇందులో ప్రయాణించేవారికి ఆహారం ఉచితంగా అందించనున్నారు. గువహతి నుంచి వచ్చేటప్పుడు అసోమీ, కోల్‌కత్తా నుంచి బయల్దేరేటప్పుడు బెంగాలీ వంటకాలు వడ్డించనున్నారు.

4 / 5
అయితే జనవరి 17వ తేదీన జరగనున్న బహిరంగ సభలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ ప్రారంభించనున్నారు. ఇదే సభలో కామాఖ్యకు వెళ్లే మరో రైలును మోదీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇక త్వరలో మరికొన్ని ప్రాంతాల మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లును ప్రవేశపెట్టనున్నారు.

అయితే జనవరి 17వ తేదీన జరగనున్న బహిరంగ సభలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ ప్రారంభించనున్నారు. ఇదే సభలో కామాఖ్యకు వెళ్లే మరో రైలును మోదీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇక త్వరలో మరికొన్ని ప్రాంతాల మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లును ప్రవేశపెట్టనున్నారు.

5 / 5