కేటీఆర్ను కలిసిన హీరో రాజశేఖర్ కూతుళ్లు..
హీరో రాజశేఖర్ కూతుళ్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ని కలిశారు.
హీరో రాజశేఖర్ కూతుళ్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ని కలిశారు. కరోనాపై పోరులో తాము సైతం అంటూ మంత్రి కేటీఆర్ని కలిసి వారు.. తమ వంతు విరాళం అందజేశారు. కరోనాపై దేశం చేస్తున్న పోరులో మేము సైతం అంటూ సినీతారలు ముందుకొస్తున్నారు. భారీ విరాళాలతో పాటు వైద్య సదుపాయాల కల్పనకై తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ ఛారిటీకి పలువురు సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. ఈ క్రమంలోనే హీరో రాజశేఖర్ కూతుళ్లు.. శివాని, శివాత్మిక మంత్రి కేటీఆర్ కలిసి చెరో లక్ష రూపాయల సాయం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యదావ్ కూడా వారి వెంట ఉన్నారు. ఈ మేరకు కేటీఆర్ను రూ. లక్ష చెక్కు అందించారు.