Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE NEET Merge: ‘జేఈఈ మెయిన్, నీట్‌ పరీక్షల విలీనం ప్రతిపాదన మాత్రమే..! రెండేళ్ల వరకు ఆ భయం లేదు’

ఇంజనీరింగ్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్టులను సీయూఈటీ-యూజీలో విలీనం చేసే దిశగా యూజీసీ ప్రతిపాదనలకు కేంద్రం బ్రేక్‌ వేసింది. జేఈఈ మెయిన్, నీట్‌లను కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టులో విలీనం చేసే ప్రక్రియ మరో రెండేళ్ల వరకు ఉండబోదని..

JEE NEET Merge: 'జేఈఈ మెయిన్, నీట్‌ పరీక్షల విలీనం ప్రతిపాదన మాత్రమే..! రెండేళ్ల వరకు ఆ భయం లేదు'
Dharmendra Pradhan
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 20, 2022 | 10:56 AM

Will JEE and NEET be Merged with CUET in 2023: ఇంజనీరింగ్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్టులను సీయూఈటీ-యూజీ (Common University Entrance Test-Undergraduate)లో విలీనం చేసే దిశగా యూజీసీ ప్రతిపాదనలకు కేంద్రం బ్రేక్‌ వేసింది. జేఈఈ మెయిన్, నీట్‌లను కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టులో విలీనం చేసే ప్రక్రియ మరో రెండేళ్ల వరకు ఉండబోదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లను కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)తో విలీనం చేసే ఆలోచన లేదని, ప్రస్తుతం పరీక్షల విలీనం కేవలం “కాన్సెప్ట్” మాత్రమేనని, తుది నిర్ణయం కాదని, విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు సూత్రప్రాయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నీట్, జేఈఈలను సీయూఈటీలో విలీనం చేసే ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని’ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

కాగా జేఈఈ మెయిన్, నీట్‌ ప్రవేశ పరీక్షల్లో ఒకే సబ్జెక్టులు ఉన్నందున ప్రత్యేకంగా జేఈఈ మెయిన్, నీట్‌ పరీక్షల నిర్వహణ అవసరం లేదని, వాటినీ సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న సీయూఈటీలో విలీనం చేస్తామని యూజీసీ ఛైర్మన్‌ ఎం జగదీశ్‌కుమార్‌ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధ్యాసాధ్యాలు, విధివిధానాలపై నిపుణుల కమిటీని నియమిస్తామని కూడా అప్పట్లో ఆయన అన్నారు. ‘ఒకే దేశం-ఒకే పరీక్ష’ నినాదంతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలకు వేరువేరుగా ఎంట్రన్స్‌ టెస్టులు రాయకుండా ఒకే ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాసి ఆయా సబ్జెక్టుల్లో ప్రవేశాలు పొందేలా కొత్త పరీక్ష విధానం ఉండబోతుందని యూజీసీ ఛైర్మన్‌ తెలిపారు. దీంతో జాతీయస్థాయిలో భారీగా డిమాండ్‌ ఉన్న ఈ పరీక్షల విలీన ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఏడాది నిర్వహించిన సీయూఈటీ-యూజీ 2022 పరీక్ష పలుచోట్ల పరీక్ష నిర్వహణ గందరగోళంగా జరిగింది. దీంతో పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ చేతకాని తనంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్, నీట్‌లను విలీనం చేసి అకస్మాత్తుగా కొత్త విధానం ప్రవేశపెడితే ఇంకెంత గందరగోళానికి దారితీస్తోందోనని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి చేసిన ప్రకటనతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు
వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..!
వీటిలో ఉప్పు కలిపితే మీ ఆరోగ్యానికి డేంజర్ బెల్స్ మోగినట్టే..!
ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే..
ఎవర్రా సామీ నువ్వు.. 19 బంతుల్లో ఒక్క బౌండరీ కొట్టలే..
షుగర్ కు చెక్ పెట్టాలంటే ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగాల్సిందే
షుగర్ కు చెక్ పెట్టాలంటే ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగాల్సిందే
ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్
ఇంటర్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్
కోచ్‌గా కాదు ఓ అసలైన తండ్రిగా.. యువీ షాకింగ్ కామెంట్స్
కోచ్‌గా కాదు ఓ అసలైన తండ్రిగా.. యువీ షాకింగ్ కామెంట్స్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్