AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Layoffs: మళ్లీ మొదలైన ఉద్యోగుల తొలగింపు.. నిన్న కాగ్నిజెంట్‌, నేడు మరో ఈ కామర్స్‌ సంస్థ.

మరోసారి ఉద్యోగుల తొలగింపు వార్తలు ఉద్యోగుల్లో కలవరపెడుతున్నాయి. మొన్నటి వరకు పెద్దగా ఉద్యోగుల తొలగింపు లేదని సంతోషించే లోపే కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి నిన్న సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ ఏకంగా 3500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లు..

Layoffs: మళ్లీ మొదలైన ఉద్యోగుల తొలగింపు.. నిన్న కాగ్నిజెంట్‌, నేడు మరో ఈ కామర్స్‌ సంస్థ.
Layoffs
Narender Vaitla
|

Updated on: May 05, 2023 | 2:38 PM

Share

మరోసారి ఉద్యోగుల తొలగింపు వార్తలు ఉద్యోగుల్లో కలవరపెడుతున్నాయి. మొన్నటి వరకు పెద్దగా ఉద్యోగుల తొలగింపు లేదని సంతోషించే లోపే కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి నిన్న సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ ఏకంగా 3500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దేశీయ ఈకామర్స్‌, యూనికార్న్‌ సంస్థ మీషో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

అయితే మీషో ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది మీషో మొత్తం 250 మందిని తొలగించింది. ఇక ఈసారి మీషో 251 మంది ఉద్యోగులను తొలగించింది. సంఖ్య చిన్నదే అయినప్పటికీ ఇది కంపెనీ మొత్తం సిబ్బందిలో 15 శాతం కావడం గమనార్హం. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మీషో సీఈఓ విదిత్ ఆత్రే ఉద్యోగులకు మెయిల్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు.

ఇదిలా ఉంటే ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి మీషో తరఫున సహకారం ఉంటుందని ఆత్రే తెలిపారు. ఉద్యోగం కోల్పోయిన వారికి 2.5 నుంచి 9 నెలల వేతనాన్ని పరిహారంగా ఇస్తామని తెలిపారు. ఈ పరిహారం ఉద్యోగుల పదవి, పనిచేసిన కాలం, వేతనం ఆధారంగా ఉంటుంది. ఉద్యోగులకు బీమా ప్రయోజనాలను కొనసాగిస్తూనే, కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడంలోనూ సహకరిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..