AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 1 Mains: టీ-శాట్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పాఠాలు ప్రసారం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్ధులు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. కొందరు కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటే.. మరికొందరేమో ఇంటి వద్దనే ప్రపరేషన్‌ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాసే టీ-శాట్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వేలకి వేలు డబ్బులు వెచ్చించి కోచింగ్‌లు తీసుకోలేని అభ్యర్థులకు టీ-శాట్‌ ప్రత్యేక పాఠాలను ప్రసారం చేయనుంది. గతంలోనూ ప్రిలిమ్స్‌ పరీక్షకు ముందు టీ-శాట్‌ అవగాహన..

TGPSC Group 1 Mains: టీ-శాట్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పాఠాలు ప్రసారం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
TGPSC Group 1 Mains on T-SAT
Srilakshmi C
|

Updated on: Aug 07, 2024 | 6:34 AM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 7: తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్ధులు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. కొందరు కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటే.. మరికొందరేమో ఇంటి వద్దనే ప్రపరేషన్‌ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాసే టీ-శాట్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వేలకి వేలు డబ్బులు వెచ్చించి కోచింగ్‌లు తీసుకోలేని అభ్యర్థులకు టీ-శాట్‌ ప్రత్యేక పాఠాలను ప్రసారం చేయనుంది. గతంలోనూ ప్రిలిమ్స్‌ పరీక్షకు ముందు టీ-శాట్‌ అవగాహన పాఠ్యాంశాలు అందించించింది. మెయిన్స్‌ పరీక్షకు కూడా అభ్యర్ధులకు పాఠాలు బోధించేందుకు 750 ఎపిసోడ్‌లను సిద్ధం చేసిందని టీ-శాట్‌ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీశాట్‌ పాఠాలు ఆగస్టు 6 నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబరు 19 వరకు ప్రతి రోజూ ఆయా అంశాలపై ప్రసారం చేసేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు.

అరగంట నిడివిగల పాఠ్యాంశాలను రోజుకు ఐదు గంటల చొప్పున ప్రసారం చేస్తున్నారు. 10 ఎపిసోడ్స్‌ 75 రోజులు టీ-శాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లలో ప్రసారం చేయనున్నట్లు టీ-శాట్‌ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. టీ-శాట్‌ నిపుణ ఛానల్‌లో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేస్తారు. మళ్లీ అవే ప్రసారాలను మరుసటి రోజు ఉదయం 5 నుంచి 10 గంటల వరకు విద్య ఛానల్‌లో ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గ్రూప్‌ 1 అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కాగా మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. జూన్‌ 9న 31 జిల్లాల్లో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేశారు. మొత్తం 31,382 మెయిన్స్‌కు ఎంపికయ్యారు. మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు పాత 10 జిల్లాల వారీగా నిర్వహించనున్నారు. మెయిన్స్‌ పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.