AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘డిగ్రీ మూడేళ్లు కాదు నాలుగేళ్లు’.. డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పుల దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తులు

డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక మీదట నాలుగేళ్లు. ఇంతకీ ఎక్కడిదీ విధానం? ఆ మార్పు చేర్పులు ఎలా ఉండబోతున్నాయ్? ఆ వివరాలు మీకోసం..

Telangana: 'డిగ్రీ మూడేళ్లు కాదు నాలుగేళ్లు'.. డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పుల దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తులు
Changes In Degree Examination System
Srilakshmi C
|

Updated on: Dec 13, 2022 | 6:49 AM

Share

తెలంగాణ డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక మీదట నాలుగేళ్లు. ఇంతకీ ఎక్కడిదీ విధానం? ఆ మార్పు చేర్పులు ఎలా ఉండబోతున్నాయ్? ఆ వివరాలు మీకోసం.. డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) నిర్ణయించింది. మూస పద్ధతికి స్వస్తి చెప్పి.. ఎగ్జామినేషన్, ఎవాల్యుయేషన్, అసెస్మెంట్‌లలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం రూప కల్పన బాధ్యతలను ఐఎస్బీకి అప్పగించింది. ఈ మేరకు నిన్న ISB, యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. ప్రస్తుత పద్ధతులు, తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. పరీక్ష విధానంలో మార్పులు విద్యార్థి హితంగా ఉండాలని నిర్ణయించారు.

కాలేజీల్లో వసతులు పెంచాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 30లోపు రిపోర్టు ఇవ్వాలని ISB కి ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు అమలు చేయాలని చెప్పింది. పెన్ అండ్ పేపర్ విధానానికి ప్రాధాన్యత తగ్గించాలని చెప్పింది. విద్యార్థికి ఉద్యోగం వచ్చే విధంగా.. ఎంపవర్ మెంట్ సాధించే విధంగా పరీక్షా విధానం ఉండాలని నిర్ణయించింది. డిగ్రీ సిలబస్ ను పూర్తిగా మార్చి.. లాంగ్వేజ్‭లలోనూ ప్రాక్టికల్స్ పెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో 4.60 లక్షల సీట్లుండగా అందులో ఏటా సగటున 2 లక్షల మంది చదువుతున్నారు. అయితే డిగ్రీ ఉత్తీర్ణుల్లో కనీసం 10 శాతం మంది కూడా నైపుణ్య ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మొత్తం మీద 40 శాతం మంది మాత్రమే ఏదో ఒక ఉద్యోగంలో చేరుతున్నారు. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వారిలో నైపుణ్యం ఉండటం లేదని, పారిశ్రామిక అవసరాలు, వృత్తి నిపుణులకు మధ్య అంతరం ఉందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. డిగ్రీ పరీక్ష విధానంలోనే మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సూచించాయి. ఈ నేపథ్యంలోనే ఐఎస్‌బీ ఉన్నత విద్యలో పరీక్ష విధానాన్ని పరిశీలించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో