AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Internal marks: ఇంటర్ ఆర్ట్స్ గ్రూపు విద్యార్ధులకూ ఇంటర్నల్ మార్కులు..! 80 మార్కులకే రాత పరీక్షలు..

రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యలో ఇంటర్ బోర్డు పలు మార్పులు తీసుకురానుంది. ఇంటర్మీడియట్​లో ఆర్ట్స్‌ గ్రూప్‌లతో పాటు భాషా సబ్జెక్టుల్లో ఇంటర్నల్‌ మార్కులు ప్రవేశ పెట్టాలని ఇంటర్మీడియట్​ బోర్డు భావిస్తోంది. మొత్తం 100 మార్కుల్లో 20 మార్కులకు ప్రాజెక్టులు లేదా అసైన్‌మెంట్‌ పేరిట ఇంటర్నల్ మార్కులకు కేటాయించాలని..

Internal marks: ఇంటర్ ఆర్ట్స్ గ్రూపు విద్యార్ధులకూ ఇంటర్నల్ మార్కులు..! 80 మార్కులకే రాత పరీక్షలు..
Internal Marks For Intermediate
Srilakshmi C
|

Updated on: Jul 24, 2025 | 3:13 PM

Share

హైదరాబాద్‌, జులై 24: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ విద్యలో ఇంటర్ బోర్డు పలు మార్పులు తీసుకురానుంది. ఇంటర్మీడియట్​లో ఆర్ట్స్‌ గ్రూప్‌లతో పాటు భాషా సబ్జెక్టుల్లో ఇంటర్నల్‌ మార్కులు ప్రవేశ పెట్టాలని ఇంటర్మీడియట్​ బోర్డు భావిస్తోంది. మొత్తం 100 మార్కుల్లో 20 మార్కులకు ప్రాజెక్టులు లేదా అసైన్‌మెంట్‌ పేరిట ఇంటర్నల్ మార్కులు కేటాయించాలని బోర్డు భావిస్తుంది. మిగతా 80 మార్కులకు రాత పరీక్ష పెట్టాలని యోచిస్తుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనలు చేసింది.

ఒక వేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే సైన్స్‌ గ్రూప్‌ విద్యార్ధులతోపాటు ఆర్ట్స్‌ గ్రూపుల విద్యార్దులకు కూడా 20 మార్కులకు ప్రాజెక్ట్ వర్క్‌ ఇవ్వనున్నారు. మరోవైపు 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయిస్తున్నారు. ఆ తరువాత విద్యా సంవత్సరం నుంచి సెకండ్ ఇయర్‌ ఇంగ్లీష్‌ సబ్జెక్టులోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.

అదే తరహాలో అన్ని లాంగ్వేజ్ సబ్జెక్టుల్లోనూ అమలు చేయాలని తాజా ఇంటర్ బోర్డు ప్రతిపాదనల్లో పేర్కొంది. దీనికి సర్కార్ అనుమతిస్తే ఇక ఇంటర్మీడియట్ హెచ్‌ఈసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఒక్కో సబ్జెక్టుకి 20 ఇంటర్నల్ మార్కులు చొప్పున బోర్డు ఇవ్వనుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్​ సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్షల విధానంలోనూ మార్పులు చేసి ఇంటర్నల్ మార్కులు చేర్చాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. పాఠ్య ప్రణాళిక రివిజన్‌ కమిటీల్లోని నిపుణుల సిఫారసు మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఈ ఏడాది నుంచే ఇంటర్‌ పరీక్షల విధానంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..
టీమిండియాపై హీరో.. మిగతా జట్లపై జీరో.. 6 ఇన్నింగ్స్‌ల్లో బౌల్ట్
టీమిండియాపై హీరో.. మిగతా జట్లపై జీరో.. 6 ఇన్నింగ్స్‌ల్లో బౌల్ట్
యంగ్ డైరెక్టర్లను వెంటాడుతున్న 'ద్వితీయ విఘ్నం'
యంగ్ డైరెక్టర్లను వెంటాడుతున్న 'ద్వితీయ విఘ్నం'
అట్లీతో మళ్లీ షారుఖ్‌.. కోలీవుడ్‌ ఎంట్రీకి కింగ్‌ ఖాన్‌ రెడీ?
అట్లీతో మళ్లీ షారుఖ్‌.. కోలీవుడ్‌ ఎంట్రీకి కింగ్‌ ఖాన్‌ రెడీ?