AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Textiles Notification 2024: తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే?

తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవల్సిందిగా ఆ శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం పోస్టుల్లో క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ పోస్టులు 8, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ పోస్టులు 22 వరకు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో..

TG Textiles Notification 2024: తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే?
TG Textiles Notification 2024
Srilakshmi C
|

Updated on: Jul 21, 2024 | 7:44 AM

Share

హైదరాబాద్‌, జులై 21: తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవల్సిందిగా ఆ శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం పోస్టుల్లో క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ పోస్టులు 8, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ పోస్టులు 22 వరకు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆమె వివరించారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే వీటితో పాటు సంబంధిత ధ్రువపత్రాలను కూడా దరఖాస్తు సమయంలో సమర్పించాలని సూచించారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద ప్రాతిపదికన మూడేళ్లపాటు విధులు నిర్వహించవల్సి ఉంటుందని శైలజా రామయ్యర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

జులై 30వ నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ 2024 కౌన్సెలింగ్‌.. షెడ్యూల్‌ ఇదే

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం 2 విడతల్లో కౌన్సెలింగ్‌ జరగనుంది. జులై 30వ తేదీన పీజీఈసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి అధ్యక్షతన జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ శనివారం జారీ చేశారు. స కాగా ఈ ఏడాది నిర్వహించిన పీజీఈసెట్‌లో మొత్తం 18,829 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కాలేజీల్లో కేవలం 8 వేల సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉత్తీర్ణులైన విద్యార్ధులంతా ఈ సీట్ల కోసం పోటీ పడనున్నారు. ఇందు కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొనవల్సి ఉంటుంది. ఆగస్టు 31వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!