AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Youth For India Fellowship 2025: ‘ఎస్‌బీఐ’ ఫెలోషిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే రూ.మూడున్నర లక్షల వరకు జీతం

డిగ్రీ పూర్తి చేసిన యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. దాదాపు 13 నెలల పాటుసాగే యూత్ ఫెలోషిప్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

SBI Youth For India Fellowship 2025: ‘ఎస్‌బీఐ’ ఫెలోషిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే రూ.మూడున్నర లక్షల వరకు జీతం
SBI Youth For India Fellowship
Srilakshmi C
|

Updated on: Apr 14, 2025 | 6:10 AM

Share

అమరావతి, ఏప్రిల్ 14: డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అద్భుత అవకాశం అందిస్తోంది. ‘యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌ 2025 పేరిట ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి ఎస్‌బీఐ ఫౌండేషన్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 13 నెలల వరకు కొనసాగే ఈ ఫెలోషిప్‌ గ్రామీణ భారతదేశంలో సామాజిక మార్పును నడిపించే లక్ష్యంతో ఏర్పాటు చేసింది. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్‌ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచడానికి అవకాశం ఉంటుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది అక్టోబరులోపు ఏదైనా డిగ్రీ కోర్టు పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు అక్టోబర్ 1, 2025వ తేదీ నాటికి 21 నుంచి 32 ఏళ్ల అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. భారతీయ పౌరులై ఉండాలి. నేపాల్‌, భూటాన్‌ లేదా ఇండియన్‌ ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ (ఐఓసీ) ఉన్నవారూ అర్హులే. ఎలాంటి రాత పరీక్షలేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఎస్‌బీఐ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేసి నేరుగా దరఖాస్తు చేసుకోండి.

ఇవి కూడా చదవండి

ఎంపికైన వారికి విద్య, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి వంటి కీలక సమస్యలను పరిష్కరించడానికి, గ్రామీణ భారతదేశాన్ని సాధికారపరచి యువతలో సామాజిక బాధ్యత స్ఫూర్తిని పెంపొందించేందుకు అవసరమైన నైపుణ్యాలపై 13 నెలల కాలంలో శిక్షణ ఇస్తారు. వీరంతా గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామీణ పరిస్థితులపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి వసతి కోసం నెలకు రూ.16 000 చొప్పున స్టైపెండ్‌తోపాటు.. స్థానికంగా ప్రయాణ ఖర్చులకు మరో రూ.2000, ప్రాజెక్టు సంబంధిత ఖర్చుల కోసం నెలకు రూ.వెయ్యిచొప్పున చెల్లిస్తారు. ఇక ఫెలోషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇతర అలవెన్సుల రూపంలో రూ.90 వేల వరకు అందజేస్తారు. మొత్తంగా పూర్తి కాలంలో రూ.3,37,000 స్టైపెండ్‌ అందుకోవచ్చన్నమాట.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?
ఇరుముడి టీచర్ ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ తెలుసా..
ఇరుముడి టీచర్ ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ తెలుసా..
RRB NTPC UG 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్
RRB NTPC UG 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్
ఇరాన్ ఉద్రిక్తతలు-వాషింగ్టన్ వ్యూహాన్ని తప్పుబట్టిన బీజింగ్!
ఇరాన్ ఉద్రిక్తతలు-వాషింగ్టన్ వ్యూహాన్ని తప్పుబట్టిన బీజింగ్!
అరచేతిలో చేప గుర్తు ఉందా? ఈ శుభసూచకాలు మీ జీవితంలో సంపద, అదృష్టం
అరచేతిలో చేప గుర్తు ఉందా? ఈ శుభసూచకాలు మీ జీవితంలో సంపద, అదృష్టం
సోదరి లేకుంటే.. రాఖీ కట్టే హక్కు ఎవరికి ఉంది?
సోదరి లేకుంటే.. రాఖీ కట్టే హక్కు ఎవరికి ఉంది?