Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2nd Session Results 2023: జేఈఈ మెయిన్‌ మలి విడత ఫలితాల తేదీ విడుదల చేసిన NTA.. ఎప్పుడంటే..

జేఈఈ మెయిన్‌-2023 తుది విడత మెయిన్‌ పరీక్షలు శనివారం (ఏప్రిల్‌ 15)తో ముగిశాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్‌ 29వ తేదీన విడుదల కానున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇక జనవరిలో జరిగిన తొలి విడత మెయిన్, తాజా పరీక్షలు రెండింటికీ హాజరైన విద్యార్ధులు..

JEE Main 2nd Session Results 2023: జేఈఈ మెయిన్‌ మలి విడత ఫలితాల తేదీ విడుదల చేసిన NTA.. ఎప్పుడంటే..
JEE Main 2nd Session Results 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 16, 2023 | 1:29 PM

జేఈఈ మెయిన్‌-2023 తుది విడత మెయిన్‌ పరీక్షలు శనివారం (ఏప్రిల్‌ 15)తో ముగిశాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్‌ 29వ తేదీన విడుదల కానున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇక జనవరిలో జరిగిన తొలి విడత మెయిన్, తాజా పరీక్షలు రెండింటికీ హాజరైన విద్యార్ధులు సాధించిన ఉత్తమ స్కోర్‌ను ఫైనల్‌ ర్యాంకుగా ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి తొలి 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి నేషన్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ర్యాంకులు కేటాయించనుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జూన్‌ 4వ తేదీన జరగనుంది. ఆ పరీక్ష రాయడానికి ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలవనుంది. ఈ మేరకు ఐఐటీ గువాహటి ప్రకటించింది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులు ప్రకటించిన మరుసటి రోజు నుంచే అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ 29న జేఈఈ మెయిన్‌ జనవరి (పేపర్‌-1)లో జరిగిన తొలివిడత పరీక్షకు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 8.24 లక్షల మంది హాజరయ్యారు. చివరి విడత (జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌)కు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 9 లక్షల మంది వరకు పరీక్షకు హాజరయ్యారు. అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు జేఈఈ మెయిన్‌-2022లో కటాఫ్‌ స్కోర్‌ కేటగిరీల వారీగా చూస్తే.. జనరల్‌ (అన్‌ రిజర్వుడ్‌) 88.4121383, ఈడబ్ల్యూఎస్‌ 63.1114141, ఓబీసీ 67.0090297, ఎస్‌సీ 43.0820954, ఎస్‌టీ 26.7771328గా నిర్ణయించారు. ఇక ఈ ఏడాది కటాఫ్‌ ఏ విధంగా ఉంటుందనే విషయంపై విద్యార్ధుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

భారత్‌లో పర్యటించనున్న జేడీ వాన్స్‌.. నేడు ప్రధాని మోడీతో భేటీ..
భారత్‌లో పర్యటించనున్న జేడీ వాన్స్‌.. నేడు ప్రధాని మోడీతో భేటీ..
భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..
భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..
ఇంటర్‌ 2025 విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల!
ఇంటర్‌ 2025 విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల!
పాడుబడిన ఇంట్లో నుంచి శబ్దాలు.. సాహసం చేసిన హీరోయిన్ చెల్లెలు
పాడుబడిన ఇంట్లో నుంచి శబ్దాలు.. సాహసం చేసిన హీరోయిన్ చెల్లెలు
29 రోజుల పగ.. వడ్డీతో తీర్చేసిన ముంబై.. కట్‌చేస్తే..
29 రోజుల పగ.. వడ్డీతో తీర్చేసిన ముంబై.. కట్‌చేస్తే..
ప్రభుత్వ బడిలో చేరమంటూ బైక్‌కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం.. ఎక్కడ
ప్రభుత్వ బడిలో చేరమంటూ బైక్‌కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం.. ఎక్కడ
నేడు తెలుగు రాష్ట్రాలకు వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
నేడు తెలుగు రాష్ట్రాలకు వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు కొనడం మంచిదని తెలుసా..
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు కొనడం మంచిదని తెలుసా..
348 రోజుల తర్వాత ఇచ్చిపడేసిన రోహిత్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
348 రోజుల తర్వాత ఇచ్చిపడేసిన రోహిత్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
మెగా DSC 2025లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్..!
మెగా DSC 2025లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్..!